Political News

రాజాసింగ్‌కు ఈసీ వార్నింగ్‌.. 24 గంట‌ల్లో వివ‌ర‌ణ‌కు ప‌ట్టు!

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ బీజేపీ నేత‌, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర‌స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసేలా.. ప్ర‌జ‌ల‌ను బెదిరించేలా మాట్లాడారంటూ.. చేసిన ఫిర్యాదుపై ఎన్నిక‌ల సంఘం స్పందించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్కు మద్దతుగా రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

ఆ వీడియో ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని పేర్కొన్న ఈసీ.. రాజాసింగ్కు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. కాగా, ఉత్తర్ప్రదేశ్లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ కొన్నాళ్ల కింద‌ట సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు.

ఉత్తర్ప్రదేశ్లో మరోసారి.. యోగి సర్కార్ రావాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని రాజాసింగ్.. ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసమే యోగి.. వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని వ్యాఖ్యానించారు. ఉత్తర్ప్రదేశ్లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ అన్నారు.  “ఈ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలి. అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేసి మరోసారి గెలిపించాలి. కొందరు యోగి మళ్లీ సీఎం కాకూడదని కుట్రలు పన్నుతున్నారు“ అని రాజా సింగ్ అన్నారు.

అంత‌టితో ఆగ‌కుండా.. “వాళ్లకి నేను చెప్పేదొకటే.. యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి రప్పించారు. మూడో దశ పోలింగ్లో బీజేపికి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తాం. వాళ్ల అందరికి ఇళ్లపైకి ఈ బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం. మీకు తెలుసుగా.. ఇవి ఏం చేస్తాయో. యూపీలో ఉండాలంటే.. జై యోగి ఆదిత్యనాథ్ అనాల్సిందే. బీజేపీకి జై కొట్టాల్సిందే. లేకపోతే.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి పారిపోవాల్సిందే“ అని రాజా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on February 17, 2022 8:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

11 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

31 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago