Political News

బీజేపీ నేతలు ఇక జుట్టు, గ‌డ్డాలు పెంచుకోవాల్సిందేనా?

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌ర్సెస్ కేసీఆర్ అన్న‌ట్లు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌ర‌మికొట్టాలంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీను వెళ్ల‌గొట్టేందుకు జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు బీజేపీపై పోరుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్‌ల‌తో మాట్లాడుతున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా విద్యుత్ చ‌ట్టం పేరుతో వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి రైతులు పొట్టగొట్టాల‌ని కేంద్రం చూస్తుంద‌ని కేసీఆర్ ఆరోపించారు.

విద్యుత సంస్క‌ర‌ణ‌ల పేరిట అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల క‌డుపు కొట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు జుట్టు, గ‌డ్డాలు పెంచుకుని తిరగాల్సిన ప‌రిస్థితి వచ్చేలా క‌నిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకిస్తూ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మ‌ణ సంఘం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. బీజేపీ నేత‌ల‌కు క్ష‌వ‌రాలు చేయ‌కూడ‌ద‌ని ఆ సంఘం తీర్మానించింది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌ల్ల కుల‌వృత్తుల‌కు ముప్పు ఏర్ప‌డింద‌ని రాష్ట్ర ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్ ప‌థ‌కం కింద కుల‌వృత్తుల వాళ్ల‌కు 250 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనివ‌ల్ల ముఖ్యంగా ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణులకు మేలు జ‌రుగుతోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చే విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల ఈ ప‌థ‌కం రద్ద‌య్యే ప్ర‌మాదం ప‌డుతుంద‌ని ఈ సంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే బీజేపీ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నెల 20 నుంచి న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి ఆందోళ‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా ఆ రోజు నుంచే బీజేపీ నేత‌ల‌కు క్ష‌వ‌రం చేయ‌మ‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నేత‌లు ప్ర‌క‌టించారు. నూత‌న విద్యుత్ చ‌ట్టం ముసాయిదాలో స‌బ్సిడీలు ఎత్తివేయాల‌ని, ఉచిత విద్యుత్‌ను ర‌ద్దు చేయాల‌ని పేర్కొన‌డం దారుణ‌మ‌ని వాళ్లు పేర్కొన్నారు. 

This post was last modified on February 15, 2022 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago