Political News

బీజేపీ నేతలు ఇక జుట్టు, గ‌డ్డాలు పెంచుకోవాల్సిందేనా?

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌ర్సెస్ కేసీఆర్ అన్న‌ట్లు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోయాయి. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌ర‌మికొట్టాలంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీను వెళ్ల‌గొట్టేందుకు జ‌నాల మ‌ద్ద‌తు ఉంటే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు బీజేపీపై పోరుకు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్‌ల‌తో మాట్లాడుతున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాజాగా విద్యుత్ చ‌ట్టం పేరుతో వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి రైతులు పొట్టగొట్టాల‌ని కేంద్రం చూస్తుంద‌ని కేసీఆర్ ఆరోపించారు.

విద్యుత సంస్క‌ర‌ణ‌ల పేరిట అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల క‌డుపు కొట్టేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు జుట్టు, గ‌డ్డాలు పెంచుకుని తిరగాల్సిన ప‌రిస్థితి వచ్చేలా క‌నిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌కు వ్య‌తిరేకిస్తూ రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మ‌ణ సంఘం ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. బీజేపీ నేత‌ల‌కు క్ష‌వ‌రాలు చేయ‌కూడ‌ద‌ని ఆ సంఘం తీర్మానించింది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు వ‌ల్ల కుల‌వృత్తుల‌కు ముప్పు ఏర్ప‌డింద‌ని రాష్ట్ర ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణ సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్ ప‌థ‌కం కింద కుల‌వృత్తుల వాళ్ల‌కు 250 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీనివ‌ల్ల ముఖ్యంగా ర‌జ‌క‌, నాయీ బ్రాహ్మ‌ణులకు మేలు జ‌రుగుతోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చే విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల ఈ ప‌థ‌కం రద్ద‌య్యే ప్ర‌మాదం ప‌డుతుంద‌ని ఈ సంఘాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే బీజేపీ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నెల 20 నుంచి న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి ఆందోళ‌న చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా ఆ రోజు నుంచే బీజేపీ నేత‌ల‌కు క్ష‌వ‌రం చేయ‌మ‌ని నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నేత‌లు ప్ర‌క‌టించారు. నూత‌న విద్యుత్ చ‌ట్టం ముసాయిదాలో స‌బ్సిడీలు ఎత్తివేయాల‌ని, ఉచిత విద్యుత్‌ను ర‌ద్దు చేయాల‌ని పేర్కొన‌డం దారుణ‌మ‌ని వాళ్లు పేర్కొన్నారు. 

This post was last modified on February 15, 2022 3:46 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

11 mins ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

13 mins ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

15 mins ago

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…

5 hours ago

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

7 hours ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

12 hours ago