Political News

కేంద్రం ఎందుకు ప్లేటు ఫిరాయించింది ?

ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది.

ఇంతకీ రెండోసారి కేంద్రం చేసిన ప్రకటన ఏమిటంటే 17వ తేదీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంతో పాటు ఆర్థిక అంశాలు ఉండవని సవరణ ప్రకటన చేసింది. దాంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో ఏమి డెవలప్మెంట్లు జరిగిందో అర్థం కాలేదు. మొదట అజెండాను సెట్ చేసింది కేంద్రమే. రాత్రికి అజెండాను మార్చేసిందీ కేంద్రమే. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ లాంటి ఆర్థిక అంశాలను మొదట కేంద్రం ఎందుకు చేర్చింది ? తర్వాత ఎందుకు తీసేసింది ?

ఉదయం కేంద్రం ప్రకటన చూసిన తర్వాత వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే రాత్రికి మారిపోయిన అజెండాతో వాళ్ళంతా మండిపోతున్నారు.  ఇదే విషయమై వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీలో చేరిన టీడీపీ ఫిరాయింపు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ లే అజెండాను మార్పించేసినట్లు ఆరోపించారు.

ఉదయం కేంద్రం చేసిన అజెండా  ప్రకటనపై చంద్రబాబునాయుడు, జీవీఎల్ ఎందుకు  ధన్యవాదాలు చెప్పలేదని అంబటి నిలదీశారు. ప్రత్యేక హోదా అంశాన్ని అంజెడాలో చేర్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనను చంద్రబాబు అండ్ కో ఎందుకు స్వాగతించలేదంటు అంబటి సూటిగా ప్రశ్నించారు. అంబటి ఆరోపణలు చేస్తున్నట్లు చంద్రబాబు అండ్ కో కు సంబంధం ఉందో లేదో తెలీదు. కానీ జీవీఎల్ మాట్లాడిన విషయంపై మాత్రం అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మొత్తానికి కేంద్రం ప్లేటు ఫిరాయించటంపై జనాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి. 

This post was last modified on February 13, 2022 3:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నంబర్ వన్ కమెడియన్లు ఒక్కటయ్యారు

తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…

2 hours ago

బండి వివాదంపై తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…

2 hours ago

త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…

3 hours ago

మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం… వాహ్!

తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…

4 hours ago

బండి సంజయ్ కు సీఎం షాక్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

4 hours ago

పవన్‌తో బాలినేని సినిమా?

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…

6 hours ago