ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది.
ఇంతకీ రెండోసారి కేంద్రం చేసిన ప్రకటన ఏమిటంటే 17వ తేదీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంతో పాటు ఆర్థిక అంశాలు ఉండవని సవరణ ప్రకటన చేసింది. దాంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో ఏమి డెవలప్మెంట్లు జరిగిందో అర్థం కాలేదు. మొదట అజెండాను సెట్ చేసింది కేంద్రమే. రాత్రికి అజెండాను మార్చేసిందీ కేంద్రమే. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ లాంటి ఆర్థిక అంశాలను మొదట కేంద్రం ఎందుకు చేర్చింది ? తర్వాత ఎందుకు తీసేసింది ?
ఉదయం కేంద్రం ప్రకటన చూసిన తర్వాత వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే రాత్రికి మారిపోయిన అజెండాతో వాళ్ళంతా మండిపోతున్నారు. ఇదే విషయమై వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీలో చేరిన టీడీపీ ఫిరాయింపు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ లే అజెండాను మార్పించేసినట్లు ఆరోపించారు.
ఉదయం కేంద్రం చేసిన అజెండా ప్రకటనపై చంద్రబాబునాయుడు, జీవీఎల్ ఎందుకు ధన్యవాదాలు చెప్పలేదని అంబటి నిలదీశారు. ప్రత్యేక హోదా అంశాన్ని అంజెడాలో చేర్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనను చంద్రబాబు అండ్ కో ఎందుకు స్వాగతించలేదంటు అంబటి సూటిగా ప్రశ్నించారు. అంబటి ఆరోపణలు చేస్తున్నట్లు చంద్రబాబు అండ్ కో కు సంబంధం ఉందో లేదో తెలీదు. కానీ జీవీఎల్ మాట్లాడిన విషయంపై మాత్రం అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి కేంద్రం ప్లేటు ఫిరాయించటంపై జనాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…