Political News

మనసులో మాట బయటపెట్టారా?

జనగామ బహిరంగ సభలో కేసీయార్ తన మనసులోని మాటను బయట పెట్టేసినట్లేనా ? ఇపుడిదే చర్చ జరుగుతోంది. ఎప్పటినుండో కేసీయార్ కు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కోరిక బలంగా ఉంది. అందుకనే ఇతర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడుతున్నది. ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పావులు కదపటానికి ప్రయత్నిస్తునే ఉన్నారు.
 
కేసీయార్ వేసే అడుగులు, మాటలు చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే బలమైన కోరిక ఉన్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. తాజాగా జనగాం బహిరంగ సభలో మరోసారి తన మనసులోని కోరికను బయటపెట్టుకున్నారనే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే జనగామ జనాలందరూ కోరుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తానని చెప్పారు.  కేంద్రంపై కేసీయార్ యుద్ధం చేయాలని అనుకున్నా ఏ హోదాలో చేయగలరు ?
 
ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం సాధ్యం కాదు. కేంద్రంపై యుద్ధమంటే ప్రత్యక్షంగా ఢిల్లీలో ఉంటేనే సాధ్యమవుతుంది. అది సాధ్యమవ్వాలంటే ఎంపీగా వెళ్ళి ఢిల్లీలోనే కూర్చోవాలి. ఎంపీగా వెళ్ళాలంటే ప్రభుత్వ పగ్గాలను వారసులకు అప్పగించేయాల్సిందే కదా. ఇందులో భాగంగానే జనగామ జనాలను అడిగింది. కేసీయార్ ఢిల్లీకి వెళతానంటే జనగామ జనాలే కాదు తెలంగాణాలో ఎవరూ కాదనరు.
  
మొత్తానికి తొందరలోనే జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ ప్రవేశించటం ఖాయమనే అర్ధమైపోతోంది. అది లోక్ సభ ద్వారానా లేకపోతే రాజ్యసభ ద్వారానా అన్నదే తేలాలి. ఒకవైపు 2013 ఎన్నికలేమో వచ్చేస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. తన ఆధ్వర్యంలోనే 2013 ఎన్నికల్లో మూడోసారి పార్టీని గెలిపించి ప్రభుత్వం పగ్గాలను వారసులకు అంటే కొడుకు కేటీయార్ కి  అప్పగించేసి హ్యాపీగా ఢిల్లీకి వెళిపోతారేమో.

This post was last modified on February 12, 2022 2:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్ తేడాగా ఉన్నా కలెక్షన్లు అదిరిపోతున్నాయ్

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…

22 minutes ago

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

48 minutes ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

1 hour ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

3 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

3 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

4 hours ago