Political News

కోమ‌టిరెడ్డికి చాప్ట‌ర్ క్లోజ్ చేసేసిన కేసీఆర్‌

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘ‌ట‌నే తెలంగాణ‌లో జ‌రిగింది. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ ర‌థ‌సార‌థి కేసీఆర్‌. తెలంగాణ జిల్లాల ప‌ర్య‌ట‌న పెట్టుకున్న‌ సీఎం కేసీఆర్ ఈ రోజు జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్థానిక ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఆస‌క్తిక‌ర రీతిలో ప్ర‌శంస‌లు కురిపించారు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అని ఎంపీ కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్ర‌శంస‌ల‌కు కార‌ణం ఎప్ప‌ట్లాగే కేసీఆర్ వ్యూహాలు, కార్యాచ‌ర‌ణ‌!

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న  భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి జ‌న‌గామ జిల్లా వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతికి పూజారి కొబ్బరికాయ అందించారు. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే తన పక్కనే ఉన్న ఎంపీ కోమటిరెడ్డికి కొబ్బరికాయ ఇచ్చి కొబ్బ‌రికాయ‌ కొట్టాల్సిందిగా కోరారు. మొదట నిరాకరించినట్టుగానే కనిపించిన ఎంపీ కోమ‌టిరెడ్డి మీరే కొట్టాలని కోరారు. అయితే, మరోసారి సీఎం కేసీఆర్ మీరే కొబ్బ‌రికాయ కొట్టండ‌ని సూచన చేయడంతో.. కోమటిరెడ్డి ఈ మేర‌కు నారికేళం కొట్టారు.

ఈ కార్య‌క్రమం అనంత‌రం ఎంపీ కోమ‌టిరెడ్డి ప్ర‌సంగిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ఎక్క‌డా లేని విధంగా నూత‌న క‌లెక్ట‌రేట్‌లు నిర్మిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్ర‌టేరియ‌ట్‌లు కూడా ఈ విధంగా నిర్మించ‌లేదు. జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం అత్యంత అద్భుతంగా నిర్మించారు అని ఎంపీ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జ‌న‌గామ జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌పున ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా రాష్ట్రానికి స‌రైన ఆదాయం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టి మ‌నం మ‌నం కొట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదని సైతం కోమ‌టిరెడ్డి సూచించారు.

చేర్యాల‌లో రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కోరారు. జ‌న‌గామ‌కు మెడిక‌ల్, పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండింటిని సీఎం త‌ప్ప‌కుండా ఇస్తార‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని సైతం కోమ‌టిరెడ్డి ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌పై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్ర విమర్శలు చేసే కోమటిరెడ్డి ఒక టెంకాయ కొట్టించే చాన్స్‌, ఒక కార్య‌క్ర‌మంలో కేసీఆర్ తో పాల్గొనే సంద‌ర్భంల‌తో ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

41 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago