ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. కేంద్రంలో ఏకచ్ఛాత్రాధిపత్యం ప్రదర్శించిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తోంది. కానీ సమర్థమైన నాయకత్వం లేకపోవడంతో అది సాధ్యం కావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. త్వరలోనే పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదీ రాజకీయాల్లో ఆ పార్టీ పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పట్టేలా కాంగ్రెస్ అద్దె కట్టలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధికారిక నివాసంతో పాటు మరికొంత మంది నాయకులు ఉంటున్న భవనాల అద్దె చెల్లించలేదని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ కార్యాలయానికి సంబంధించి గత పదేళ్ల అద్దె రూ.12,69,902 బకాయి ఉంది. అక్బర్ రోడ్డులోని 26వ నంబర్ భవనంలో పార్టీ కార్యాలయం ఉంది.
2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దె చెల్లించలేదు. ఆయా పార్టీలు సొంత భవనాలు నిర్మించుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 2010 జూన్లోనే కాంగ్రెస్కు భూ కేటాయింపు జరిగినా భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా.. అనేక సార్లు గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తోంది.
మరోవైపు జన్పథ్ రోడ్లోని 10వ నెంబర్ ఇంట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉంటున్నారు. 2020 సెప్టెంబర్ నుంచి ఆ భవనం రెంట్ కూడా కట్టలేదు. ఆ అద్దె బాకీ రూ.4,610 ఉంది. చాణక్యపురిలోని ది-11/109 భవనంలో ఉండే సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ అద్దె బాకీ ఏకంగా రూ.5,07,911గా ఉందని కేంద్రం తెలిపింది. సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఈ వివరాలు వెల్లడించింది.
This post was last modified on February 11, 2022 2:10 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…