Political News

కాంగ్రెస్‌.. అద్దె కూడా క‌ట్ట‌లేక‌పోతుందా?

ఒక‌ప్పుడు దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన కాంగ్రెస్ ప‌రిస్థితి ఇప్పుడు దయ‌నీయంగా మారింది. కేంద్రంలో ఏకచ్ఛాత్రాధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ ఇప్పుడు తిరిగి పున‌ర్వైభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. కానీ స‌మ‌ర్థ‌మైన నాయ‌కత్వం లేక‌పోవ‌డంతో అది సాధ్యం కావ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో పంజాబ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్లో మాత్ర‌మే ఆ పార్టీ అధికారంలో ఉంది. త్వ‌ర‌లోనే పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అక్క‌డ ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇదీ రాజ‌కీయాల్లో ఆ పార్టీ ప‌రిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టేలా కాంగ్రెస్ అద్దె క‌ట్ట‌లేద‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధికారిక నివాసంతో పాటు మ‌రికొంత మంది నాయ‌కులు ఉంటున్న భ‌వ‌నాల అద్దె చెల్లించ‌లేద‌ని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ కార్యాల‌యానికి సంబంధించి గ‌త ప‌దేళ్ల అద్దె రూ.12,69,902 బ‌కాయి ఉంది. అక్బ‌ర్ రోడ్డులోని 26వ నంబ‌ర్ భ‌వ‌నంలో పార్టీ కార్యాల‌యం ఉంది.

2012 డిసెంబ‌ర్ త‌ర్వాత ఆ భ‌వ‌నం అద్దె చెల్లించ‌లేదు. ఆయా పార్టీలు సొంత భ‌వ‌నాలు నిర్మించుకునేందుకు మూడేళ్లు స‌మ‌యం ఇస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వ భ‌వ‌నాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 2010 జూన్‌లోనే కాంగ్రెస్‌కు భూ కేటాయింపు జ‌రిగినా భ‌వ‌న నిర్మాణం పూర్తి కాలేదు. 2013లోనే కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నా.. అనేక సార్లు గ‌డువు పొడిగించాల‌ని ప్రభుత్వాన్ని కోరుతూ వ‌స్తోంది.

మ‌రోవైపు జ‌న్‌ప‌థ్ రోడ్‌లోని 10వ నెంబ‌ర్ ఇంట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉంటున్నారు. 2020 సెప్టెంబ‌ర్ నుంచి ఆ భ‌వ‌నం రెంట్ కూడా క‌ట్ట‌లేదు. ఆ అద్దె బాకీ రూ.4,610 ఉంది. చాణ‌క్య‌పురిలోని ది‍‍-11/109 భ‌వ‌నంలో ఉండే సోనియా వ్యక్తిగ‌త కార్య‌ద‌ర్శి విన్సెంట్ జార్జ్ అద్దె బాకీ ఏకంగా రూ.5,07,911గా ఉంద‌ని కేంద్రం తెలిపింది. సుజిత్ ప‌టేల్ అనే సామాజిక కార్య‌క‌ర్త స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేయ‌గా.. కేంద్ర గృహ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. 

This post was last modified on February 11, 2022 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

38 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago