తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ కానున్నాయా..? ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి మోదీ వ్యాఖ్యలు ఆశనిపాతంలా మారనున్నాయా..? పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా మోదీ ప్రవర్తిస్తున్నారా..? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గొడవ ఉత్తుత్తిదేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు.
మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడిని కొనసాగించారు. ముందు రోజే లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు అంశంపై మాట్లాడిన మోదీ నిన్న రాజ్యసభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్ దారుణంగా ప్రవర్తించిందని.. పార్లమెంటులో మైకులు ఆపి.. పెప్పర్ స్ప్రే కొట్టి విభజన బిల్లును ఆమోదించారని మోదీ విమర్శించారు. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారని ఆరోపించారు. ఇంకా ఇంతర అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు మోదీ. అయితే దీనిపై తెలంగాణలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ఇదే అవకాశంగా ఎదురు దాడికి దిగాయి.
తెలంగాణ ఏర్పాటును మోదీ అవమానించారని.. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధానికి తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు ఉందని.. వ్యతిరేక భావజాలం ఏర్పర్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా మోదీ దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ సైలెంట్ అయింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఇతర నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ పై పోరాడుతున్న తమకు మోదీ వ్యాఖ్యలు నష్టం చేకూర్చే అవకాశం ఉందని భయపడుతున్నాయి పార్టీ శ్రేణులు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీకి ఉమ్మడి శత్రువైన తమను నిలువరించేందుకే మోదీ ఈ ఎత్తుగడకు పాల్పడ్డారని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల తెలంగాణలో మళ్లీ సెంటిమెంటును రాజేసి తిరిగి అధికారంలోకి రావొచ్చని టీఆర్ఎస్ భావన. తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని భావించిన మోదీ టీఆర్ఎస్ ను పైకి లేపేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతల సందేహం. చూడాలి మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో..?
This post was last modified on February 10, 2022 12:23 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…