పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. తెలంగాణలోని అధాకారపార్టీ టీఆర్ ఎస్, కాంగ్రెస్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ ఎస్ శ్రేణులు ట్విటర్ లో పెట్టిన “మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ” అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. టీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. టీఆర్ ఎస్ మద్దతుదారులు `మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ట్వీటర్లో పెట్టిన హ్యాష్టాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
టీఆర్ ఎస్ మద్దతుదారులు గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు ట్విట్టర్ ట్రెండింగ్లో రెండో స్థానంలో ఉన్నాయి. రాజకీయాంశాల్లో తొలిస్థానంలో నిలిచాయి.
ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నిరసన తెలపాలంటూ టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలు రోడ్డెక్కారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనాలు చేస్తూ నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని నేతలు మండిపడుతున్నారు.
కాగా, పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే… ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి… ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని… మోడీ ఆక్షేపించారు. దీనిపై మంత్రులు, ఇతర పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం గమనార్హం.
This post was last modified on February 9, 2022 10:31 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…