Political News

స‌మ‌తామూర్తి విగ్ర‌హంపై కొత్త వివాదం రాజేసిన రాహుల్‌

ప్రధాన‌మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేసిన సంగ‌తి తెలిసిందే. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆత్మ‌నిర్భ‌ర్ భారత్ గురించి కామెంట్లు చేశారు.

చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ కంపెనీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని తయారుచేసింది. ఈ పంచలోహ విగ్రహంలో 83శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను ఉపయోగించారు. 1600 విడిభాగాలుగా భారత్కు తీసుకొచ్చిన ఈ విగ్రహాన్ని 15 నెలల పాటు శ్రమించి అతికించారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చైనాలో తయారు చేశారు.. నవ భారత్ ఇండియా చైనాపై నిర్భరమేనా అంటూ ప్రధానికి చురకలంటించారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఏర్పాటుచేసిన స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ జాతికి అంకితం చేయ‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లోనే రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి సైతం ద‌ర్శించ‌నున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్ స‌మ‌తామూర్తిని ద‌ర్శించుకున్నారు. ఇలా స్థానిక నేత‌లు మొదలుకొని దేశంలోని అత్యంత ప్ర‌ముఖుల ద‌ర్శ‌నీయ కేంద్రంగా నిలిచిన స‌మతామూర్తిపై రాహుల్ వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే హాట్ టాపిక్‌గా మారాయి.

This post was last modified on February 9, 2022 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

59 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago