Political News

తెలంగాణ‌లోనూ ఇక గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం!

తెలంగాణ రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల మూడ్ కనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ దూరంగా ఉండ‌డంతో వార్ మ‌రింత ముదిరింది. మోడీతో యుద్దానికి దిగాన‌న్న సంకేతాల‌ను కేసీఆర్ పంపించారు. మోడీ రాష్ట్రానికి వ‌స్తే క‌నీసం ఆయ‌న వైపు క‌న్నెత్తి కూడా చూడ‌కుండా క‌మ‌లం పార్టీతో క‌య్యానికి తాను సిద్ధ‌మ‌య్యాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జ్వ‌రం సాకుతో ఆయ‌న త‌ప్పించుకున్నార‌ని, మోడీని అవ‌మానించార‌ని బీజేపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రిన్ని మ‌లుపులు తీసుకోబోతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. కేసీఆర్ స‌మ‌రానికి సై అన‌డంతో బీజేపీ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌నుంది. గ‌వ‌ర్న‌ర్‌తో కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్టున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు కేసీఆర్ రాజ్‌భ‌వ‌న్ వెళ్ల‌లేదు. దీంతో దూరం మ‌రింత పెరిగింది.

మ‌రోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న ప్ర‌భుత్వాల‌పై గ‌వ‌ర్న‌ర్‌ను ప్రయోగించ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌కు ముందు గ‌వ‌ర్న‌ర్‌తో మమ‌తా బెన‌ర్జీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ‌మ‌త వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్‌గా ఎన్నిక‌ల‌కు ముందు పెద్ద యుద్ధ‌మే న‌డిచింది. ఇక ఢిల్లీ, పుదుచ్చేరిలోనూ ముఖ్య‌మంత్రుల‌ను ఇబ్బంది పెట్టేలా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు గ‌తంలో వ్య‌వ‌హ‌రించారు.  ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ గ‌వ‌ర్న‌ర్‌తో స్టాలిన్ ఇబ్బంది ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తెలంగాణ‌లోనూ బీజేపీ అదే ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌బోతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ఇక్క‌డ కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వ‌చ్చే రోజుల్లో ప్ర‌భుత్వ విధానాల‌పై నిర్ణ‌యాల‌పై ఆమె వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్ర‌తిపాదిస్తూ కేసీఆర్ మంత్రివ‌ర్గం చేసిన ప్ర‌తిపాద‌న‌ను తమిళి సై అమోదించ‌లేరు. దీంతో ఆయ‌న్ని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇటీవ‌ల ఎంపీ అర‌వింద్ దాడిపైనా గ‌వ‌ర్న‌ర్ ఆరా తీశారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ కేసీఆర్‌గా ప‌రిస్థితి మారేలా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

Satya

Recent Posts

ప్రశ్న రావణ్ విషయంలో చేతులెత్తేసిన జడ శ్రావణ్?

ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…

2 hours ago

ట్రంప్ తిప్పలు… వీడియో కాల్ లో నిశ్చితార్థం

అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…

2 hours ago

విహార యాత్రలో విషాదం… 15 మంది భారతీయులు మృతి

విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…

2 hours ago

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…

4 hours ago

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…

4 hours ago

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…

5 hours ago