ప్రధాని నరేంద్ర మోడీ చాన్నాళ్ల తర్వాత తెలుగు గడ్డపై అడుగు పెట్టారు. రామానుజాచార్యుల వెయ్యో జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ శివార్లలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు భారత ప్రధాని. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో తెలుగు సినిమా గురించి ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి కీర్తిని కొనియాడుతూ.. ఆయన తెలుగు సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్పై అద్భుతాలు సృష్టిస్తోందని.. సిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు మోడీ. అలాగే తెలుగు భాష మీదా ఆయన ప్రశంసలు కురిపించారు.
తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని వ్యాఖ్యానించారు. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమని, పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయని అన్నారు. తెలుగు సినిమాల గురించి మోడీ ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హరీష్ శంకర్ సహా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాహుబలి సినిమా దగ్గర్నుంచి తెలుగు సినిమాల గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య పుష్ప సినిమాతో మన సినిమాలకున్న గుర్తింపు ఇంకా పెరిగింది. ఈ చిత్రం నార్త్ ఇండియాలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నింటికీ ఉత్తరాదిన మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే జనాల నాడిని పట్టిన మోడీ.. తెలుగు సినిమాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
This post was last modified on February 6, 2022 12:44 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…