Political News

మోడీపై కేసీఆర్ అల‌క‌.. త‌ల‌సానితో స్వాగ‌తం

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఈ నెల 5న‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఆయ‌న వ‌స్తున్నారు. శంషాబాద్‌ ముచ్చింతల్ లో జ‌రుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వ‌స్తున్నారు. అయితే, ఈ టూర్లో ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌ల‌క‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు.

ఇంతేకాకుండా, త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానం ప‌లికించాల‌ని ఆయ‌న ఏర్పాట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం మధ్యాహ్నం 2.45గం.లకు పఠాన్ చెరులోని ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయాన్ని, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేయనున్నట్టు మోదీ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, స్మారక స్టాంపును అవిష్కరించనున్న ప్రధాన మంత్రి. అనంతరం సాయంత్రం 5గం.లకు రామానూజాచర్య సమత మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన స‌మ‌యంలో స్వాగ‌తం తెలుపుతున్న‌పుడు మ‌రియు తిరిగివెళుతున్న స‌మ‌యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారికంగా కూడా స‌మాచారం ఇచ్చేశారు. పైగా మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానించ‌డం , వీడ్కోలు ప‌ల‌క‌డం చేయాల‌ని డిసైడ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలాఉండ‌గా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on February 5, 2022 8:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

5 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

10 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

10 hours ago