Political News

మోడీపై కేసీఆర్ అల‌క‌.. త‌ల‌సానితో స్వాగ‌తం

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఈ నెల 5న‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు కీల‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఆయ‌న వ‌స్తున్నారు. శంషాబాద్‌ ముచ్చింతల్ లో జ‌రుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వ‌స్తున్నారు. అయితే, ఈ టూర్లో ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌ల‌క‌వ‌ద్ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు.

ఇంతేకాకుండా, త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానం ప‌లికించాల‌ని ఆయ‌న ఏర్పాట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం మధ్యాహ్నం 2.45గం.లకు పఠాన్ చెరులోని ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయాన్ని, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ రెండు సౌకర్యాలు ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాలోని చిన్న రైతుల కోసం అంకితం చేయనున్నట్టు మోదీ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ ప్రత్యేకంగా రూపొందించిన లోగోను, స్మారక స్టాంపును అవిష్కరించనున్న ప్రధాన మంత్రి. అనంతరం సాయంత్రం 5గం.లకు రామానూజాచర్య సమత మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన స‌మ‌యంలో స్వాగ‌తం తెలుపుతున్న‌పుడు మ‌రియు తిరిగివెళుతున్న స‌మ‌యంలో ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారికంగా కూడా స‌మాచారం ఇచ్చేశారు. పైగా మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తో ఆహ్వానించ‌డం , వీడ్కోలు ప‌ల‌క‌డం చేయాల‌ని డిసైడ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలాఉండ‌గా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతోపాటు, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on February 5, 2022 8:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

2 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

2 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

3 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

4 hours ago

ఒంట‌రి పోరు వెనుక `విజ‌య్‌` ర‌హ‌స్యం బయటపడిందా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…

4 hours ago

బైకర్ స్పీడ్ ఇంకా పెరగాలి

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…

4 hours ago