ఏపీలో పట్టు కోసం ప్రయత్నిస్తూ వైసీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్న బీజేపీపై జగన్ నేరుగా కౌంటర్లు వేయకపోయినా.. ఇతర మార్గాల్లో మాత్రం దీటుగా స్పందిస్తున్నారు. మతం పేరుతో జనాల్ని రెచ్చగొట్టే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వకుండా వైసీపీ తెలివిగా వ్యవహరించిందని ప్రస్తుతం అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన జగన్.. ఈ విషయంలో బీజేపీకి చెక్ పెట్టారని విశ్లేషకులు అంటున్నారు.
ఏపీలో బలపడేందుకు బీజేపీ మతాన్నే నమ్ముకుందని ఇప్పటికే విమర్శలున్నాయి. జగన్ క్రిస్టియన్ కావడంతో ఆ అవకాశాన్ని వాడుకుని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని వైసీసీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో హిందువుల ఆలయాల ధ్వంసం, రథాలు, విగ్రహాల దహనం అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరులోని జిన్నాటవర్ను బీజేపీ ఓ అస్త్రంగా ఎంచుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దాన్ని కూలగొట్టాలని ఆ సెంటర్కు జిన్నా పేరు తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గతంలో ఆందోళనకు దిగింది. ఇప్పటికీ ఈ విషయంపై వైసీపీని ప్రశ్నిస్తూనే ఉంది. సున్నితమైన అంశం కావడంతో వైసీపీ కూడా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఒక్క నిర్ణయంతో ఇప్పుడు బీజేపీకి చెక్ పెట్టింది. అదే జిన్నా టవర్కు జాతీయ పతాక రంగులు వేయడం. దీంతో బీజేపీకి ఎలాంటి రచ్చ చేసే అవకాశం ఇవ్వకుండా వైసీపీ వ్యవహరించిందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు మేయర్ శివనాగ మనోహర్ నాయుడు, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా జిన్నా టవర్ విషయంలో గుంటూరు వాసుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం టవర్కు జాతీయ జెండా రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేయించారు. అంతే కాకుండా ఈ నెల 3న జిన్నా టవర్ వద్ద జాతీయ పతకం ఎగరేయాలని తీర్మానించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీజేపీ మత రాజకీయాలకు.. వైసీపీ జాతీయ వాదంతో దెబ్బకొట్టిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…