Political News

అడ్రస్ లేని బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మామూలుగా ఏదో విషయంపై ప్రభుత్వంపై ఎగిరెగిరిపడే కమలనాథులు బడ్జెట్ తర్వాత ఎందుకని ఎక్కడా కనబడటంలేదు ? ఎందుకంటే రాష్ట్రప్రయోజనాల విషయంలో బడ్జెట్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఊసులేకపోవటమే. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రస్తావన లేదు. రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమీ మాట్లాడలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల ఊసేలేదు.

ఇలా ఏరకంగా తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొట్టింది కేంద్రం. జనాలంతా బడ్జెట్ తీరుతో కేంద్రంపై మండిపోతున్నారు. జననాడి గమనించిన తర్వాత కమలనాథులు బడ్జెట్ గురించి మాట్లాడటానికి భయపడినట్లున్నారు. అందుకనే మీడియా ముందుకు రావడానికి మొహం చెల్లలేదు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఏమి మాట్లాడాలో తెలియని బీజేపీ నేతలు ఒక్కోసారి ఒక్కోరకంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.

ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పాలసీని బహిరంగంగా మద్దతు పలకలేక అలాగని వ్యతిరేకించలేక ఎంత అవస్థలు పడుతున్నారో అర్ధమైపోతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే జనాలంతా నరేంద్రమోడి సర్కార్ పై మండిపోతున్నారు. ఈ కారణంగానే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కటం లేదు.

ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై రాష్ట్రం పెట్టుకున్న ఆశలంతా అడియాశలైపోయింది. ప్రజాగ్రహాన్ని గమనించిన కారణంగానే కమలనాథులు బడ్జెట్ పై స్పందించటానికి వెనకాడుతున్నారు. ఇపుడే కాదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనల విషయంలో ఇలాగే జరుగుతోంది. బహుశా రాష్ట్రానికి ఏమి చేసినా చేయకపోయినా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదని నిర్ధారణకు వచ్చినట్లున్నారు కేంద్రంలోని పెద్దలు. అందుకనే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తున్నారు. 

This post was last modified on February 2, 2022 12:30 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

23 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

33 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

52 minutes ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago