గుడివాడ క్యాసినో పై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. క్యాసినో నిర్వహించామని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడ క్యాసినోకు 500 కోట్లు వచ్చాయంటున్న టీడీపీ నేతలు.. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి అని ఎద్దేవా చేశారు. క్యాసినో నిర్వహించామ ని టీడీపీ నాయకులు అల్లరి చేస్తున్నారని విమర్శించారు. గుడివాడలో తనను ఓడించలేకే.. లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలకు అన్ని తెలుసన్న నాని.. 3 రోజుల క్యాసినోకు 362 రోజులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు జీవిత కాలం సమయమిచ్చా.. ఇక వాళ్ల ఇష్టం అని స్పష్టం చేశారు.
పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.
అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరిం చాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి అని మంత్రి కొడాలి నాని అన్నారు.
This post was last modified on January 29, 2022 4:55 pm
మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…