దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది.
ఆ ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ 563.47 కోట్లతో(26.46 శాతం) ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల కేటగిరిలో జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్పీ రూ.618.86 కోట్లు ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్డీఆర్ డిపాజిట్ల పరంగా ఎస్పీకి రూ.434.219 కోట్లు ఉండగా, టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి.
ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు తమ రుణాలను రూ.134.93 కోట్లుగా చూపించాయి. జాతీయ పార్టీలు రూ.74.27 కోట్లు రుణాలు చూపించగా, కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.49.55 కోట్లు చూపించింది. ప్రాంతీయ పార్టీలు రూ.60.66 కోట్ల మేరకు రుణాలున్నట్టు ప్రకటించాయి.
This post was last modified on January 29, 2022 9:04 am
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…
దేశ రాజధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్రమేనని అందరికీ తెలిసిందే. ఇక్కడ చిత్రమైన పరిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…
ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…