Political News

టీఆర్ఎస్ పార్టీ ఆస్తి రూ.300 కోట్లు

దేశంలోని రాజకీయ పార్టీల్లో అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన పార్టీగా బీజేపీ సత్తా చాటుకుంది. 2019-20లో తమ ఆస్తుల విలువను రూ.4,847 కోట్లుగా ప్రకటించింది. బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందించింది.

ఆ ప్రకారం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు కాగా, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో(26.46 శాతం) ముందు వరుసలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, ఆ వెనక 267.61 కోట్లతో అన్నాడీఎంకే ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల్లో 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. డిపాజిట్ల కేటగిరిలో జాతీయ పార్టీల్లో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్‌పీ రూ.618.86 కోట్లు ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్‌డీఆర్ డిపాజిట్ల పరంగా ఎస్‌పీకి రూ.434.219 కోట్లు ఉండగా, టీఆర్ఎస్ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి.

ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు తమ రుణాలను రూ.134.93 కోట్లుగా చూపించాయి. జాతీయ పార్టీలు రూ.74.27 కోట్లు రుణాలు చూపించగా, కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.49.55 కోట్లు చూపించింది. ప్రాంతీయ పార్టీలు రూ.60.66 కోట్ల మేరకు రుణాలున్నట్టు ప్రకటించాయి.

This post was last modified on January 29, 2022 9:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago