Political News

కొత్త జిల్లాలు… వైసీపీలోనే ఇంత వ్య‌తిరేక‌తా!

వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇప్పుడు ఈ మాటే జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. తాడేప‌ల్లి ఆఫీస్ నుంచి కూడా కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఫోన్లు కూడా వెళ్తున్నాయి. అర్ధం చేసుకోండి సార్‌! అంటూ.. నేత‌ల‌ను బుజ్జ‌గిస్తు న్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యాల‌ను కొంద‌రు సొంత పార్టీ నాయ కులే వ్య‌తిరేకిస్తుండ‌డం. వాస్త‌వానికి ఎక్క‌డైనా.. ప్ర‌భుత్వ పార్టీ నాయ‌కులు స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యా ల‌ను స్వాగ‌తించాల్సినఅవ‌స‌రం ఉంటుంది. కానీ, వైసీపీలో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌ల కంటే ముందుగానే సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌ల బాణాలు వ‌చ్చాయి.

గుంటూరు జిల్లాలో ప‌ల్నాడు జిల్లాకు ఆ పేరు వ‌ద్దంటూ.. తొలుత‌.. ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తే డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు.. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు పేరును పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలోని కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుం ట మహీథర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన జిల్లాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతూ ప్రతిపాదించారు. ఈ విషయమై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉనికిని కోల్పోతోంద‌ని అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను లేకుండా చేయడం మంచిది కాదన్నారు. రెవెన్యూ డివిజన్ లో ఎన్ని మండలాలు ఉంటాయన్నది ప్రశ్న కాదని, కందుకూరు రెవెన్యూ డివిజన్ గా కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటి కే లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.  ఇక‌, అన్న‌మ‌య్య జిల్లాఏర్పాటుపై రాయ‌చోటిలో వైసీపీ నేత‌లే అగ్గిరాజేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌ను రాజంపేట కేంద్రం గా జిల్లా ఏర్పాటు చేయాల‌ని.. రాయ‌చోటివ‌ద్ద‌ని చెబుతున్నారు.

ఇలా.. అన్ని వైపుల నుంచి వైసీపీ నేత‌లే గొంతు విప్పుతుంటే.. ప్ర‌బుత్వానికి కూడా చిర్రెత్తుకొస్తున్న ప‌రిస్థి తి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిని బుజ్జ‌గించేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలాంటి డిమాండ్లు లేక‌పోవ‌డం.. ఏదో ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే డిమాండ్లు వినిపిస్తుండ‌గా.. మిగిలిన రాష్ట్రం అంతా కూడా.. ఎక్క‌డా టీడీపీ నేత‌ల హ‌డావుడి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే సొంత పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు వైసీపీ అధిష్టాన‌మే రంగంలొకి దిగింద‌ని తెలుస్తోంది.

This post was last modified on January 28, 2022 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago