Political News

కొత్త జిల్లాలు… వైసీపీలోనే ఇంత వ్య‌తిరేక‌తా!

వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇప్పుడు ఈ మాటే జోరుగా వినిపిస్తోంది. అంతేకాదు.. తాడేప‌ల్లి ఆఫీస్ నుంచి కూడా కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఫోన్లు కూడా వెళ్తున్నాయి. అర్ధం చేసుకోండి సార్‌! అంటూ.. నేత‌ల‌ను బుజ్జ‌గిస్తు న్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యాల‌ను కొంద‌రు సొంత పార్టీ నాయ కులే వ్య‌తిరేకిస్తుండ‌డం. వాస్త‌వానికి ఎక్క‌డైనా.. ప్ర‌భుత్వ పార్టీ నాయ‌కులు స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యా ల‌ను స్వాగ‌తించాల్సినఅవ‌స‌రం ఉంటుంది. కానీ, వైసీపీలో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌ల కంటే ముందుగానే సొంత పార్టీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌ల బాణాలు వ‌చ్చాయి.

గుంటూరు జిల్లాలో ప‌ల్నాడు జిల్లాకు ఆ పేరు వ‌ద్దంటూ.. తొలుత‌.. ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తే డిమాండ్ చేశారు. ఈ జిల్లాకు.. మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు పేరును పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్రకాశం జిల్లాలోని కందుకూరును రెవెన్యూ డివిజన్ గా కొనసాగించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుం ట మహీథర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన జిల్లాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతూ ప్రతిపాదించారు. ఈ విషయమై ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉనికిని కోల్పోతోంద‌ని అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ను లేకుండా చేయడం మంచిది కాదన్నారు. రెవెన్యూ డివిజన్ లో ఎన్ని మండలాలు ఉంటాయన్నది ప్రశ్న కాదని, కందుకూరు రెవెన్యూ డివిజన్ గా కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు. ఈ విషయాన్ని ఇప్పటి కే లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.  ఇక‌, అన్న‌మ‌య్య జిల్లాఏర్పాటుపై రాయ‌చోటిలో వైసీపీ నేత‌లే అగ్గిరాజేసిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ‌ను రాజంపేట కేంద్రం గా జిల్లా ఏర్పాటు చేయాల‌ని.. రాయ‌చోటివ‌ద్ద‌ని చెబుతున్నారు.

ఇలా.. అన్ని వైపుల నుంచి వైసీపీ నేత‌లే గొంతు విప్పుతుంటే.. ప్ర‌బుత్వానికి కూడా చిర్రెత్తుకొస్తున్న ప‌రిస్థి తి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వారిని బుజ్జ‌గించేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. చిత్రం ఏంటంటే.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలాంటి డిమాండ్లు లేక‌పోవ‌డం.. ఏదో ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే డిమాండ్లు వినిపిస్తుండ‌గా.. మిగిలిన రాష్ట్రం అంతా కూడా.. ఎక్క‌డా టీడీపీ నేత‌ల హ‌డావుడి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే సొంత పార్టీ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు వైసీపీ అధిష్టాన‌మే రంగంలొకి దిగింద‌ని తెలుస్తోంది.

This post was last modified on January 28, 2022 2:45 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

2 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

4 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

5 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

5 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

6 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

6 hours ago