Political News

తల్ల‌కిందులైన ఏపీ జిల్లాలు… ఎన్నిక‌ల‌పై ఎఫెక్ట్ త‌ప్ప‌దా…!

ఏపీ సర్కారు తీసుకున్న జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యంతో రాష్ట్ర స్వ‌రూపం మొత్తం త‌ల‌కిందులైంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు.. మూడు జిల్లాలు(గుంటూరు, బాప‌ట్ల‌, ప‌ల్నాడు) కానుంది. అదేవిధంగా తూర్పుగోదావ‌రి కూడా మూడు జిల్లాలు(తూర్పుగోదావ‌రి, రాజ‌మ‌హేం ద్ర‌వ‌రం, కోన‌సీమ‌) ఏర్పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల స్వ‌రూపం, జ‌నాభా విస్తీర్ణం స‌హా అనేక రూపాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ‌లితంగా ఆ జిల్లాల మౌలిక స్వ‌రూప‌మే కాకుండా.. అస్థిత్వం కూడా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో భోగౌళిక విస్తీర్ణంలో ఒంగోలు జిల్లా టాప్‌లో నిలిచింది. 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ జిల్లా విస్తరించి ఉంది. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 8.8 శాతం ఈ ఒక్క జిల్లాలోనే ఉంది. 12,251 చ.కి.మీ. విస్తీర్ణంతో అల్లూరి సీతారామరాజు జిల్లా (9.54%) రెండోస్థానంలో నిలిచింది. ఇంతకు ముందు విస్తీర్ణంలో పెద్ద జిల్లాగా ఉన్న అనంతపురం ఇప్పుడు 11,359 చ.కి.మీ.తో (7శాతం) మూడో స్థానంలో ఉంది.

 928 చ.కి.మీ. విస్తీర్ణం మాత్రమే ఉన్న విశాఖపట్నం జిల్లా (0.6%) చివరి స్థానంలో నిలవడం విశేషం. ఇక జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాతో పాటు అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, శ్రీబాలాజీ, శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలు 20 లక్షలపైనే జనాభాను కలిగి ఉన్నాయి. గిరిజన జిల్లాలైన మన్యం జిల్లాలో 9.72 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9.54 లక్షల జనాభా ఉంది.  

14 జిల్లాల్లో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. 10 జిల్లాల్లో మూడు చొప్పున రెవెన్యూ డివిజన్‌లున్నాయి. ఒంగోలులో అత్యధికంగా 38 మండలాలు ఉండగా నెల్లూరులో 35, శ్రీబాలాజీలో 35, అనంతపురంలో 34, కడపలో 34 చొప్పున ఉన్నాయి.

అయితే.. ఈవిభ‌జ‌న ద్వారా .. ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో కులాల ప్రాతిప‌దిక‌న ప‌లు మండలాల్లో ఓటింగ్ ప్ర‌భావం ఉండేద‌ని.. ఇప్పుడు ఇలా కులాల ప్రాతిప‌దిక‌గా బలంగా ఉన్న మండ‌లాలు చాలా వ‌ర‌కు .. వేరే మండ‌లాల్లో క‌లిసిపోవ‌డంతో ఆయా మండ‌లాల్లో.. ఎన్నిక‌ల్లో ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని.. అంటున్నారు. ఇది.. అక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధుల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిని అధికార ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుంటారో చూడాలి.

This post was last modified on January 28, 2022 6:59 pm

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

23 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago