Political News

వ‌న్ ఇయ‌ర్ త‌ర్వాత‌.. మ‌న‌దే సీఎం పీఠం: సంజ‌య్

తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. వారు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎదుగుదల జీర్ణించుకోలేక.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో  ఎంపీలపై దాడులు చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

లోక్ సభ ప్రివిలైజ్‌ కమిటీకి అర్వింద్‌పై దాడి అంశాన్ని తీసుకెళ్తామని సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ సంవత్సరమే టీఆర్ ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని.. తర్వాత కచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “ ఒక్క సంవ‌త్స‌రం ఓపిక ప‌ట్టండి.. త‌ర్వాత‌..మ‌నదే ప్ర‌భుత్వం“ అని బండి వ్యాఖ్యానించారు. “నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి… కేసీఆర్‌. తెలంగాణ కోసం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు ఏం త్యాగాలు చేశారు?. కేసీఆర్‌ దొంగ దీక్ష చేశారు, మమ్మల్ని ఏం చేయలేరు. దాడులు చేసినా ప్రజల కోసం భరిస్తాం“ అని వ్యాఖ్యానించారు.

“ కేసీఆర్‌ రాష్ట్రంలో అధికారంలో ఉంటే..కేంద్రంలో మేం ఉన్నాం. నిరుద్యోగ భృతి, పీఆర్సీ, పంట కొనుగోళ్లు, 317 జీవోపై బీజేపీ ప్రశ్నిస్తోందని.. దాడులకు పాల్పడటం నీచమైన చర్య. మేం దాడులు చేయడం మొదలుపెడితే బిస్తర్ కట్టాల్సిందే“ అని సంజ‌య్ కామెంట్ చేశారు. . సీఎం కార్యాలయం దర్శకత్వంలోనే దాడులు చేయించారన్నారు. ఎంపీపై దాడి జరిగితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. దాడిచేసిన అందరూ బయట తిరుగుతున్నారని సంజయ్ తెలిపారు.

తమపైనే దాడి చేసి తిరిగి తమమీదే కేసులు పెడతారని తెలుసని.. కరీంనగర్లోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులను కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలని.. బీజేపీ నేతలను రెచ్చగొట్టొద్దని బండి సంజయ్ హెచ్చరించారు. ఎంపీ అర్వింద్‌పై దాడి ఘటనపై సీఎం స్పందించి, దాడిని ఖండించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

This post was last modified on January 28, 2022 8:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago