ఏపీ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. మాజీ మంత్రి.. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోనే టీడీపీకి చెందిన మరో నేతను అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ నాయకులుగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంరతం వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
బీఎస్3 వాహనాల్ని బీఎస్4 వాహనాలుగా చూపించి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మినట్లుగా వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దీనికి సంబంధించిన భాగోతం బయటకు వచ్చింది. దీనిపై ఫోకస్ చేసిన అధికారులు.. ఈ నేరానికి సంబంధించిన పలు విస్మయకర విషయాల్ని బయటకు తీశారు. ఈ తీరులో దాదాపు 154 వాహనాల్ని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగా ఫేక్ ఎన్వోసీ.. ఫేక్ ఇన్యూరెన్సుల్ని దాఖలు చేసిన నేరాల్లో వీరిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ ట్రావెల్స్ పై నకిలీ రిజిస్ట్రేషన్లపై 24 కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన పోలీసులు ఈ ఉదయం (శనివారం) హైదరాబాద్ కు వచ్చారు. వారు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను.. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ ఉదంతం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపటంతో.. మరిన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 13, 2020 8:56 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…