సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గుడివాడలో జరిగినట్టు టీడీపీ ఆరోపిస్తున్న క్యాసినోపై స్పందించారు. తనదైన శైలిలో ఆయన ట్వీట్ చేశారు. క్యాసినో వ్యవహారం గుడవాడకు కొత్తకాదని చెప్పిన వర్మ.. దీనిపై మంత్రి నాని కన్నా ముందుగా దివంగత ఎన్టీఆర్ను ప్రశ్నించాలి.. అంటూ తాజాగా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
గత కొన్ని రోజులుగా ఏపీలో టికెట్స్ రేట్ల విషయంలో, ఆ తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన వ్యవహారం మీద వర్మ తీవ్ర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుడివాడ క్యాసినోపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. అందులో ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి నేను గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నాను.
అలాగే, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించా రు. అందుకే, క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్ను ప్రశ్నించాలి’ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ట్వీట్కు ‘యమగోల’ సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ అనే వీడియో సాంగ్ను జత చేయడం ఆసక్తికరమైన విషయం.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, ఇంతకముందు టికెట్ రేట్ల విషయంలో ఏపీ మంత్రి పేర్ని నానితో వర్మ చర్చచలు జరిపిన సంగతి తెలిసిందే. కానీ, దీని వల్ల ఎలాంటి పరిష్కారం లభించలేదు. వర్మ మాత్రం ఈ మధ్య వరుస ట్వీట్స్తో వార్తల్లో నిలుస్తున్నారు. మరి వర్మ ట్వీట్పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో… లేక.. మనకెందుకులే అనుకుంటారో.. చూడాలి.
This post was last modified on January 25, 2022 7:26 am
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…
మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల…
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్బ్రాండ్.. కొడాలి నానికి రాజకీయంగా గుడివాడ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఆయన వరుస విజయాలు…
పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షా బుధవారం స్వదేశానికి సురక్షితంగా…
మే 30 విడుదల కావాల్సిన కింగ్ డమ్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. పోస్ట్ పోన్ వార్త పాతదే అయినా…