గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్లో క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానికి, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం నడుస్తోందని ఆరోపిస్తే…ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అంటూ కొడాలి నాని చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై, ఏపీ డీజీప సవాంగ్ పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఇంటి గేటు తాకినా కొడాలి నాని శవాన్ని పంపుతామని బుద్దా వెంకన్న షాకింగ్ కామెంట్లు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అరగంటలో కొడాలి నానిని జనం చంపుతారని, ఈ లోపే కొడాలి నాని దుబాయ్ పారిపోతాడని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా.. తేల్చుకుందాం అంటూ నానికి సవాల్ విసిరారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని, కొడాలి నానికి టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటని వెంకన్న అన్నారు.
హరికృష్ణను కొడాలి నాని మోసం చేశారని ఆరోపించారు. అంతేకాదు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పోలీస్ అధికారిగా ఉన్నపుడు కొడాలి నానిని స్టేషన్ లో వేసి చితక్కొట్టారని వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలేమైనా నీ బావ ,బావమరిది అనుకున్నావా..? వాడు ,వీడు అంటున్నావు అంటూ వెంకన్న ధ్వజమెత్తారు. నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు.
డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీయని, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబును తిడుతుంటే డీజీపీ ఎందుకు మాట్లాడరని వెంకన్న నిలదీశారు. నానిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే డీజీపీ దేశంలో మరెక్కడా లేరని, ఈ డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదని బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. సవాంగ్ పదవీ కాలం మరో ఏడాదిలో ముగుస్తుందని, ఆ తర్వాత వదలబోమని, తనను అరెస్టు చేసినా, కేసులు పెట్టుకున్నా, చంపినా భయపడబోనని అన్నారు.
This post was last modified on January 24, 2022 8:22 pm
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…