ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సాధారణమే. అలా ఎన్నిసార్లయినా చేయడానికి వెనుకాడరు. తాజాగా ఏపీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా మరోసారి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మళ్లీ తట్టా బుట్టా సర్దుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తాజా రాజకీయ పరిణామాలే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే రేణుక ఎంపీ అయ్యారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమెకు జగన్ కర్నూలు పార్లమెంట్ సీటు కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో ఆమె 40 వేల పైచిలుకు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడిపై గెలిచారు. మరోవైపు ఆమె భర్త శివ నీలకంఠ మొదటి నుంచి టీడీపీ సానుభూతి పరుడిగా ఉన్నారు. ముందుగానే ఆయన టీడీపీలో చేరారు. ఎంపీగా గెలిచిన తర్వాత రేణుకు కూడా వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి దగ్గరైంది.
కానీ 2019 ఎన్నికల్లో కర్నూలు టికెట్ను కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి బాబు ఇవ్వడంతో ఆమె తిరిగి వైసీపీలోకి వెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమెకు జగన్ టికెట్ ఇవ్వలేదు. పోనీ ఆ తర్వాతనైనా ఎమ్మెల్సీగా చేస్తారని ఎదురు చూసిన ఆమెకు నిరాశే మిగిలింది. ఒకసారి పార్టీ నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చిన నేతలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వరని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రేణుక మరోసారి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్లో ఏదో ఒకటి ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సారి కర్నూలు ఎంపీ సీటును కొత్తవాళ్లకు ఇచ్చేందుకు బాబు ఆలోచిస్తున్నారని అలాగే ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ కోసం ఆమె సైకిల్ ఎక్కేందుకు సై అంటున్నారు. కర్నూలు పార్లమెంట్ లేదా ఎమ్మిగనూరు అసెంబ్లీ సీటులో ఏదో ఒకటి ఇస్తామనే హామీ వస్తే వెంటనే ఆమె టీడీపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి.
This post was last modified on January 23, 2022 4:52 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…