Political News

బీజేపీకి వ‌రుస షాక్‌లు

గోవాలో ఎన్నిక‌ల‌కు ముందు అధికార బీజేపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు వ‌రుస‌గా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కీల‌క స‌మ‌యంలో పార్టీకి దెబ్బ ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రాజీనామాలు, చేరిక‌ల‌తో గోవా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవడంతో దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న‌యుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గోవా మాజీ ముఖ్య‌మంత్రి ల‌క్ష్మీకాంత్ పర్సేక‌ర్ కూడా త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌ని కార‌ణంతో పార్టీకి రాజీనామా చేయానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో పోటీచేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను బీజేపీ ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. 34 మందితో ఆ జాబితాను విడుద‌ల చేసింది. అందులో దివంగ‌త సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న‌యుడు ఉత్ప‌ల్‌కు చోటు ఇవ్వ‌లేదు. ఆ రాష్ట్రంలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించిన మ‌నోహ‌ర్ త‌న మ‌ర‌ణం వ‌ర‌కూ 25 ఏళ్ల పాటు ప‌నాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌న తండ్రి మృతితో ఈ ఎన్నిక‌ల్లో ఆ స్థానం నుంచి ఉత్ప‌ల్ పోటీ చేయ‌డానికి స‌న్నాహ‌కాలు చేసుకున్నారు. కానీ బీజేపీ ఆయ‌న‌కు షాకిచ్చింది. టికెట్ నిరాక‌రించింది. ఆయ‌న‌కు బ‌దులు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన వివాదాస్ప‌ద ఎమ్మెల్యే అటానాసియోకు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఉత్ప‌ల్ పార్టీకి రాజీనామా చేసి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఇప్పుడు గోవా మాజీ సీఎం ల‌క్ష్మీకాంత్ ప‌ర్సేక‌ర్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. 2002 నుంచి 2017 వ‌ర‌కు ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హించిన మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ద‌యానంద్ సోప్టేను బ‌రిలో దింప‌నుంది. 2017 ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీకాంత్‌పై గెలిచిన ద‌యానంద్ ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. మ‌రోవైపు ల‌క్ష్మీకాంత్ 2014 నుంచి 2017 వ‌ర‌కూ గోవా సీఎంగా ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుండ‌గా పార్టీ టికెట్ నిరాక‌రించ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లోనే తాను పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న గోవా ఎన్నిక‌ల్లో బీజేపీ మేనిఫెస్టో క‌మిటీకి అధ్య‌క్షుడిగా ఉన్నారు. 

This post was last modified on January 23, 2022 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

42 seconds ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

45 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago