ఒక్క సీటులో కూడా గెలుస్తుందో లేదో తెలీని ఎంఐఎం పెద్ద పార్టీలను కూడా వణికించేస్తోంది. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఇదంతా. ఎంఐఎం 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మొదటి జాబితాలో 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మిగిలిన పార్టీ అధినేతలు గెలుపు కోసం టెన్షన్ పడుతుంటే ఓవైసీ మాత్రం వినోదం చూస్తున్నారు.
యూపీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల ఓట్లు కూడా అత్యంత కీలకమనే చెప్పాలి. ప్రతి ఎన్నికలోను ముస్లిం ఓట్లు కీలకమే అయినా రాబోయే ఎన్నికల్లో అధికారం నిలుపుకోవటం బీజేపీకి అత్యంత ప్రతిష్ట గా మారింది. ఇదే సమయంలో అధికారాన్ని అందుకోవటం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా బాగా ప్రిస్టేజిగా తీసుకున్నారు. దాంతో ఈ రెండు పార్టీలు ఏ సామాజిక వర్గం ఓట్లను కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. సరిగ్గా ఇక్కడే ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది.
యూపీలోని 12 జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు. సుమారు 143 నియోజకవర్గాల్లో ముస్లింలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వీటిల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో గెలుపోటములను డిక్టేట్ చేసేంత ఓట్లున్నాయి. అందుకనే అఖిలేష్ ముస్లిం ఓటు బ్యాంకుపై కన్నేశారు. అఖిలేష్ ముస్లిం-యాదవ-ఓబీసీ-జాట్ కాంబినేషన్తో ఎన్నికలకు వెళుతున్నారు. బీజేపీ కూడా బ్రాహ్మణ-ఓబీసీ-ముస్లిం-ఎస్సీ నినాదంతో ఎన్నికలకు వెళుతోంది. అయితే ఒవైసీని దింపింది బీజేపీయే అనే విమర్శ బలంగా ప్రచారంలో ఉంది.
ఇక్కడ ప్రధాన పార్టీలకు సమస్య ఏమొచ్చిందంటే ముస్లిం జనాభా ఎక్కడ ఎక్కువుందో చూసి మరీ ఎంఐఎం అభ్యర్ధులను పోటీకి పెడుతోంది. 100 నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేయబోతోంది. ఈ వంద నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గెలవకపోయినా ప్రత్యర్ధులను ఓడగొట్టగలదు. ఎలాగంటే పోయిన ఎన్నికల్లో 30 చోట్ల పోటీ చేసిన ఎంఐఎం ఒక్క చోట కూడా గెలవలేదు. కానీ కొన్నింటిలో బీఎస్పీ, మరికొన్నింటిలో ఎస్పీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది. మరి దీని ప్రభావం తమపై ఎక్కడ పడుతుందో అని ఎస్పీ తదితర పార్టీ అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతోందట.
This post was last modified on January 23, 2022 11:40 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…