Political News

సీఎం జ‌గ‌న్‌, సాయిరెడ్డిల‌కు ఆర్ ఆర్ ఆర్ సవాల్‌

త‌న మాట‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కించే వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డికి సంచ‌ల‌న స‌వాల్ రువ్వారు. కొన్నాళ్లుగా త‌న‌పై సాయిరెడ్డి చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌యసాయిరెడ్డి.. త‌న‌ను పారిపోయార‌ని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. త‌ప్పించుకున్నార‌ని.. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా విష‌యంలో దోబూచులు ఆడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్న‌ట్టు ర‌ఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేద‌ని.. త‌న ఎంపీ బాధ్య‌త‌ల్లో భాగంగానే ఢిల్లీకి వ‌చ్చాన‌ని.. సీఐడీ ఇచ్చిన నోటీసుల‌పై కోర్టులో కేసు వేశాన‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే ఎంపీ సాయిరెడ్డికి, సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ స‌వాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఇద్ద‌రు నేత‌లు.. ఒప్పుకొంటే.. తక్షణం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానని అన్నారు. త‌న స‌వాలుకు ఇద్ద‌రు నేత‌లు స్పందించాల‌ని అన్నారు. తాను త‌ప్పించుకునే టైపు కాద‌ని ర‌ఘురామ తెలిపారు. అంతేకాదు.. ఇప్పుడైనా త‌న స‌వాల్‌ను స్వీక‌రిస్తే.. వెంట‌నే త‌న‌పై వేటు వేయించాల‌ని.. లేక‌పోతే.. వేయించ‌లేన‌ని ఒప్పుకోవాల‌ని అన్నారు. ఇప్పుడు బంతి జ‌గ‌న్‌, సాయిరెడ్డి చేతుల్లోనే ఉంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. ఇక‌, ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.

తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును ఏపీ సీఎం జ‌గ‌న్‌ నిలిపివేయించారన్నారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే… ప్రభుత్వానికి నష్టమన్నారు.

This post was last modified on January 22, 2022 10:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇండస్ట్రీలో కొత్త ‘అల్లరోడు’

అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…

1 hour ago

ఏడాది తర్వాత… ఈ రోజు విధ్వంసమే

ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…

3 hours ago

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

4 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

7 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

7 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

7 hours ago