Political News

సీఎం జ‌గ‌న్‌, సాయిరెడ్డిల‌కు ఆర్ ఆర్ ఆర్ సవాల్‌

త‌న మాట‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కించే వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డికి సంచ‌ల‌న స‌వాల్ రువ్వారు. కొన్నాళ్లుగా త‌న‌పై సాయిరెడ్డి చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌యసాయిరెడ్డి.. త‌న‌ను పారిపోయార‌ని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. త‌ప్పించుకున్నార‌ని.. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా విష‌యంలో దోబూచులు ఆడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్న‌ట్టు ర‌ఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేద‌ని.. త‌న ఎంపీ బాధ్య‌త‌ల్లో భాగంగానే ఢిల్లీకి వ‌చ్చాన‌ని.. సీఐడీ ఇచ్చిన నోటీసుల‌పై కోర్టులో కేసు వేశాన‌ని అన్నారు.

ఈ క్ర‌మంలోనే ఎంపీ సాయిరెడ్డికి, సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ స‌వాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయించలేమని ఇద్ద‌రు నేత‌లు.. ఒప్పుకొంటే.. తక్షణం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తానని అన్నారు. త‌న స‌వాలుకు ఇద్ద‌రు నేత‌లు స్పందించాల‌ని అన్నారు. తాను త‌ప్పించుకునే టైపు కాద‌ని ర‌ఘురామ తెలిపారు. అంతేకాదు.. ఇప్పుడైనా త‌న స‌వాల్‌ను స్వీక‌రిస్తే.. వెంట‌నే త‌న‌పై వేటు వేయించాల‌ని.. లేక‌పోతే.. వేయించ‌లేన‌ని ఒప్పుకోవాల‌ని అన్నారు. ఇప్పుడు బంతి జ‌గ‌న్‌, సాయిరెడ్డి చేతుల్లోనే ఉంద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. ఇక‌, ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.

తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును ఏపీ సీఎం జ‌గ‌న్‌ నిలిపివేయించారన్నారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే… ప్రభుత్వానికి నష్టమన్నారు.

This post was last modified on January 22, 2022 10:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago