సోషల్ మీడియాలో చాలామంది కొడాలి నాని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. బూతుల మంత్రి అని పిలుస్తుంటారు. ఇందులో టీడీపీ వాళ్లు మాత్రమే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో మీడియా ముందు బూతుల దండకం అందుకుంటూ ఉంటారు. ఎవరి రెకమండేషన్తో వచ్చింది అన్నది పక్కన పెడితే నానికి టీడీపీలో తొలిసారిగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది చంద్రబాబు నాయుడే అన్నది వాస్తవం. కానీ ఆయన మీద ఎందుకంత పగో అర్థం కాదు కానీ.. బాబు పేరెత్తితే చాలు పేట్రేగిపోతుంటాడు నాని.
అలాగే ఆయన తనయుడు లోకేష్ను కూడా తిట్టని తిట్టు తిడుతుంటాడు. ఇప్పటికే ఈ విషయంలో హద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయిన నాని.. ఇప్పుడు మరింత కిందికి దిగిపోయారు. ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిపోయి చంద్రబాబును ఉద్దేశించి ఒక దిగజారుడు వ్యాఖ్య చేశారు నాని.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో నడపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా కొడాలి నానికి చెందిన కళ్యాణమండపంలోనే జరిగిందని.. మూడు రోజుల పాటు ఇక్కడ వందల లావాదేవీలు జరిగాయని.. అందులో నానికి కూడా భారీగానే ముట్టిందని టీడీపీ నేతలు ఆరోపించడం తెలిసిందే. ఐతే నాని మాత్రం క్యాసినోతో తనకు సంబంధమే లేదంటున్నాడు. అసలలాంటిదేమీ గుడివాడలో జరగలేదంటున్నారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పెట్రోలు పోసి తగలబెట్టుకుంటానని కూడా సవాలు చేశారు.
కాగా దీని గురించి ఒక టీవీ ఛానెల్ తాజాగా నానీని ప్రశ్నించగా.. ఆయన చంద్రబాబు మీద శివాలెత్తిపోయారు. మీ కళ్యాణమండపంలో క్యాసినో నడపలేదని మీరే రుజువు చేయొచ్చు కదా అంటే.. నేను ఇప్పుడు చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని అంటాను. అది నిజం కాదని చంద్రబాబు రుజువు చేస్తాడా అని ఎదురు ప్రశ్నించారు నాని. ఇదే మాటను మళ్లీ వల్లిస్తూ.. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఇంకెవడో అంటాడు. కాదని బాబు నిరూపిస్తాడా అంటూ మరో కామెంట్ కూడా చేశారు నాని. దీనికి తోడు చంద్రబాబునుద్దేశించి 420 గాడని, ఇంకోటని ఎప్పట్లాగే అందుకున్న తిట్లు మామూలే.
This post was last modified on January 22, 2022 10:23 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…