ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోడీ 71 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనెడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడోలకు 43 శాతం ప్రజామోదం లభించింది. ఇటీవల కాలంలో వరుస ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ 26 శాతం ప్రజామోదంతో జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు.
మార్నింగ్ కన్సల్ట్ గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోడీ నంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోడీకి 84 శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత గతేడాది మే నెలలో కరోనా రెండో దశ ఉద్ధృతి సమయంలో మాత్రం ఇది 63 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో 71 శాతం మంది మోడీని ప్రపంచంలోనే అత్యుత్తమ నేతగా ప్రజలు ఆమోదించారు. జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్ కన్సల్ట్ ఈ రేటింగ్స్ను విడుదల చేసింది. అమెరికాలో సగటున రోజుకు 45వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. మిగతా దేశాల్లో సగటున 3000 – 5000 మందిని సర్వే చేశారు.
ఎవరి స్థానాలు ఎలా అంటే..
నరేంద్ర మోడీ(71 శాతం), పెజ్ ఒబ్రేడర్, మెక్సికో అధ్యక్షుడు(66 శాతం), మారియో డ్రాగీ, ఇటలీ ప్రధాని(60 శాతం), ఫుమియో కిషిదా, జపాన్ ప్రధాని (48 శాతం), ఒలఫ్ స్కాల్జ్, జర్మనీ ఛాన్సలర్ (44 శాతం), జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు(43 శాతం), జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని(43 శాతం), స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని(41 శాతం), పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రధాని (40 శాతం), మూన్ జే-ఇన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు(38 శాతం), జైర్ బోల్సొనారో, బ్రెజిల్ అధ్యక్షుడు(37 శాతం) ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు(34 శాతం), బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని (26 శాతం) మొత్తం 13 దేశాల అధినేతల స్థానాలు ఇవే.
This post was last modified on January 21, 2022 9:18 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…