Political News

జ‌గన్ ద‌గ్గ‌ర కంటే బాబు ద‌గ్గ‌రే ఆ స్వేచ్ఛ ఉందా ?

సాధార‌ణంగా.. ఏ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నా.. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే.. ప్ర‌బుత్వాన్ని ముందుండి న‌డిపించే వారిలో ఉన్న‌తాధికారులే ముందుంటారు. ఐఏఎస్‌, ఐపీఎస్ లు కీల‌క పాత్ర పోషిస్తారు. అందు కే.. ప్ర‌భుత్వానికి ముక్కుచెవులు కూడా వారేన‌నిఅంటారు. గ‌తంలో ఉన్న‌తాధికారులు.. చంద్ర‌బాబు పాల‌న‌పై తీవ్ర ఆవేద‌న‌ వ్యక్తం చేసేవారు. స‌మ‌యం పాడు లేకుండా స‌మీక్ష‌లు చేస్తున్నార‌ని.. ఇంటి ప‌ట్టున ఉండేం దుకు కుటుంబంతో గ‌డిపేందుకు కూడా స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించేవారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు మాత్రం త‌న మానాన త‌ను ముందుకు సాగారు.

ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో పాల‌న మారింది. పాల‌న తీరు కూడా మారింది. అధికారుల‌ను ఎవ‌రినైనా ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. అంద‌రినీ సాయంత్రం 6 గంట‌ల‌కే ఇంటికి పంపేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ కూడా సాయంత్రం 6 త‌ర్వాత ఎలాంటి స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఆదివారం వ‌స్తే.. ఆయ‌న కూడా దాదాపు ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఎలాంటి ప‌నినీ పెట్టుకోవ‌డం లేదు. అయితే.. ఇప్పుడు కూడా అధికారులు గుస్సాగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అధికారులు ఎందుకు ఫైర్ అవుతున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

దీనికి కార‌ణం.. త‌మ మాట‌కు సీఎం జ‌గ‌న్ వాల్యూ ఇవ్వ‌డం లేద‌ని వారు భావిస్తుండ‌డ‌మే. క్షేత్ర‌స్తాయిలో ప‌రిస్థితి ఇలా ఉంద‌ని చెప్పినా.. ఆయ‌న మాత్రం తాను తీసుకున్న నిర్ణ‌యం మేర‌కే న‌డుస్తున్నార‌ని అంటున్నారు. దీంతో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చి.. అది మాపై రిఫ్లెక్ట్ కావ‌డంతోపాటు.. కోర్టుల నుంచి కూడా తిట్టు త‌ప్ప‌డం లేద‌ని వాపోతున్నారు. ఇటీవ‌ల కాలంలో .. అనేక మంది అధికారులు.. కోర్టుల‌కు వెళ్లి నిల‌బ‌డడాన్ని వారు చెబుతున్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా..మంత్రుల‌ను డ‌మ్మీల‌ను చేశార‌ని విమ‌ర్శించిన వైసీపీ నాయ‌క‌త్వం.. అధికారంలోకి వ‌చ్చాక అంత‌కు మంచి వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఓ సీనియ‌ర్ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు.

జ‌గ‌న్ పాల‌న‌తో పోలిస్తే చంద్ర‌బాబు హ‌యాంలోనే మంత్రుల‌కు కాస్త స్వేచ్చ ఉండేద‌ని మ‌రో ఐఏఎస్ అధికారి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయా శాఖ‌ల మంత్రుల‌కు సంబంధించిన నిర్ణ‌యాలు కూడా సీఎం ద‌గ్గ‌ర ప‌లుమార్లు పెండింగ్ లో ప‌డిపోతున్నాయ‌ని..ఆయన చూసి చెపితే త‌ప్ప‌..అవి ఏమి అయ్యాయి అని అడిగే సాహ‌సం మంత్రులు చేయ‌టంలేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఉంది. మంత్రుల సంగ‌తి ఎలా ఉన్నా.. అధికారుల ప‌ర‌స్థితిమాత్రం ఇబ్బందిగానే ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

This post was last modified on January 21, 2022 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago