Political News

బుర‌ఖాలు వ‌ద్దు.. పాఠ‌శాల‌ల‌కు అనుమతించం.. క‌ర్ణాట‌క మంత్రి

బీజేపీ పాలిత క‌ర్ణాట‌క రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి బీసీ న‌గేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన విద్యార్థినులు త‌మ సంప్ర‌దాయం ప్ర‌కారం.. బుర‌ఖాలు ధ‌రించి.. పాఠ‌శాల‌కు, కాలేజీల‌కు రావడాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాదు.. విద్యార్థినులు బుర‌ఖాలు ధ‌రించి వ‌స్తే.. పాఠ‌శాల‌ల‌కు మేం అనుమ‌తించేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు మంత్రి వ్యాఖ్య‌లు వివాదాన్ని రేపుతున్నాయి.

మైనారిటీ విద్యార్థినులు పాఠశాలలు, కాలేజీలకు బురఖాలు ధరించి రావడం క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనమని విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. “1985లో యూనిఫామ్ లను ప్రవేశపెట్టింది విద్యార్థులలో ఏకత్వం తీసుకురావడం కోసమే. విద్యాలయాలు ఒకరి మత ఆచారాలకు వేదిక కాకూడదనే” అని మంత్రి క్లాస్ పీకారు. ఉడిపి జిల్లా బాలికల ప్రభుత్వ కాలేజీ.. బురఖాలతో విద్యార్థినులను అనుమతించడం లేదు. దీంతో బురఖాతో తరగతి గదిలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు విద్యార్థినులు గత డిసెంబర్ నుంచి కాలేజీ వద్దే నిరసనకు దిగారు.

దీనిపై మంత్రి స్పందిస్తూ, విద్యార్థుల చర్య రాజకీయ ప్రేరేపితమేన‌ని అన్నారు. కాలేజీ చర్యను సమర్థిస్తున్న‌ట్టు మంత్రి నగేష్ చెప్పారు. “ఒకవేళ ఆరుగురు విద్యార్థినులు తమ మత విశ్వాసాన్ని ఆచరించే విషయంలో అంత మొండిగా ఉంటే కాలేజీ నుంచి వెళ్లిపోవచ్చు. బురఖాలను అనుమతించే మరో విద్యా సంస్థలో చేరొచ్చు” అని మంత్రి నగేశ్ స్పష్టం చేశారు.

అదే కాలేజీలో మరో 94 మంది ముస్లిం విద్యార్థినులు యూనిఫామ్ తో వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు నిరసనకు దిగిన ఆరుగురు విద్యార్థినులు సైతం గత ఏడాదిన్నరగా బురఖాలు లేకుండానే క్లాస్ కు హాజరైనట్టు చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి సంప్ర‌దాయానికి ఒక్క‌సారి అనుమ‌తిస్తే.. ఇక‌, ఇదే కొన‌సాగుతుంద‌ని.. ఇత‌ర మ‌తాల వారు కూడా వివిధ రీతుల్లో హాజ‌ర‌వుతార‌ని.. అప్పుడు స్కూళ్లు కాస్తా.. మ‌తాల‌కు వేదిక‌లుగా మారుతాయ‌ని మంత్రి చెప్పుకొచ్చారు. విద్యార్థుల మ‌ధ్య మ‌త సామ‌ర‌స్యం ఉండాల‌ని సూచించారు. అయితే.. మంత్రి వ్యాఖ్య‌ల‌ను విప‌క్షాలు త‌ప్పుబడుతున్నాయి. రాష్ట్రాన్ని హిందూత్వం చేయాల‌నే ఉద్దేశంతోనే మంత్రి ఇలా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించాయి.

This post was last modified on January 21, 2022 4:01 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago