తాజాగా ఒక ఆశ్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే జరిపిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిదే విజయమని పేర్కొంటూ ఫలితాలు విడుదల చేసింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే జరిపాయి. ఈ సర్వేలో నరేంద్ర మోడీ వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే బలం తగ్గుతుందని స్పష్టంగా తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 296 సీట్లు వస్తాయని తేలింది. అలాగే యూపీఏకి 127 సీట్లు, ఇతరులకు 120 సీట్లు వస్తాయని అర్ధమవుతోంది. ఇతరులు అన్న హెడ్ లోనే తెలంగాణా కేసీయార్, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్, పశ్చిమబెంగాల్లో మమత లాంటి వాళ్ళున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే యూపీయే కూడా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం యూపీయే బలం సుమారు 60 సీట్లకే పరిమతమయ్యుంది.
అలాంటిది తన బలాన్ని రెట్టింపు చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకుంటున్నట్లు కనబడలేదు. ఎందుకంటే దానికి సొంతంగా 62 సీట్లు వస్తుందని తేలింది. అంటే డీఎంకే లాంటి భాగస్వామ్య పక్షాలు పుంజుకోవటం వల్లే యూపీఏ బలం పెరుగుతోందని అనుకోవాలి. ఇక తెలంగాణా, ఏపీ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ+జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో జగన్ పైన జనాదరణ ఏమీ తగ్గలేదని కూడా స్పష్టమైంది.
కాబట్టే అత్యధిక సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందట. అత్యధిక ఎంపీ సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందని సర్వేలో తేలిందంటే రాష్ట్రంలో అధికారం కూడా వైసీపీ సంబరపడుతోంది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లను వైసీపీ గెలిస్తే కానీ అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపు సాధ్యం కాదు. కాబట్టి ఇటు ఎంపీ సీట్లను అటు అసెంబ్లీ సీట్లను వైసీపీయే గెలుస్తుందని ఇండియ టు డే సర్వేలో తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సర్వేలన్నీ నూరుశాతం నిజమనేందుకు కూడా లేదు.
ఎందుకంటే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండున్నరేళ్ళుంది. అప్పటికి పరిస్దితుల్లో ఏమి మార్పొస్తుందో ఎవరు చెప్పలేరు. పైగా ఇపుడు వెల్లడైన మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు ఎప్పుడు సర్వే చేసినవో తెలీదు. కాకపోతే జనాల నాడి ఎలాగుంది అనే అంచనాకు మాత్రం రావచ్చంతే. అయితే, ఏపీలో పరిణామాలు మాత్రం ఇంకోరకరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రను ఓటీఎస్ కుదిపేస్తోంది. విశాఖను ఉక్కు ఉద్యమం వేధిస్తోంది. గోదావరి జిల్లాల పోలవరం ఆశ తీరలేదు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం వాళ్ల రాజధాని కల కరిగిపోయింది. రాయలసీమ నీళ్లు, వరద సాయం లేదు. అన్నింటికి మించి ఓటీఎస్ స్కీం, పింఛన్లు పెంచకపోవడం, ఇసుక మద్యం, నిర్మాణ రంగంలో ఉపాధి పోవడం… ఇన్నింటి నేపథ్యంలో ఈ సర్వే లో జగన్ కే సీట్లు వస్తాయని చెప్పడం కాస్త ఆశ్చర్యమే. అంటే జగన్ పథకాలు ఈ సమస్యలను అధిగమించాయా? లేకపోతే ఈ సర్వే ఏమన్నా…. !!!!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…