తాజాగా ఒక ఆశ్ మూడ్ ఆప్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే జరిపిన తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డిదే విజయమని పేర్కొంటూ ఫలితాలు విడుదల చేసింది . మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయమై పై రెండు సంస్ధలు దేశవ్యాప్తంగా సర్వే జరిపాయి. ఈ సర్వేలో నరేంద్ర మోడీ వైపే జనాలు ఎక్కువగా మొగ్గు చూపారు. అయితే మొన్నటి ఎన్నికలతో పోల్చుకుంటే బలం తగ్గుతుందని స్పష్టంగా తేలింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 296 సీట్లు వస్తాయని తేలింది. అలాగే యూపీఏకి 127 సీట్లు, ఇతరులకు 120 సీట్లు వస్తాయని అర్ధమవుతోంది. ఇతరులు అన్న హెడ్ లోనే తెలంగాణా కేసీయార్, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్, పశ్చిమబెంగాల్లో మమత లాంటి వాళ్ళున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే యూపీయే కూడా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం యూపీయే బలం సుమారు 60 సీట్లకే పరిమతమయ్యుంది.
అలాంటిది తన బలాన్ని రెట్టింపు చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకుంటున్నట్లు కనబడలేదు. ఎందుకంటే దానికి సొంతంగా 62 సీట్లు వస్తుందని తేలింది. అంటే డీఎంకే లాంటి భాగస్వామ్య పక్షాలు పుంజుకోవటం వల్లే యూపీఏ బలం పెరుగుతోందని అనుకోవాలి. ఇక తెలంగాణా, ఏపీ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ+జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఇదే సమయంలో జగన్ పైన జనాదరణ ఏమీ తగ్గలేదని కూడా స్పష్టమైంది.
కాబట్టే అత్యధిక సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందట. అత్యధిక ఎంపీ సీట్లను మళ్ళీ వైసీపీయే గెలుచుకుంటుందని సర్వేలో తేలిందంటే రాష్ట్రంలో అధికారం కూడా వైసీపీ సంబరపడుతోంది. పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సీట్లను వైసీపీ గెలిస్తే కానీ అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపు సాధ్యం కాదు. కాబట్టి ఇటు ఎంపీ సీట్లను అటు అసెంబ్లీ సీట్లను వైసీపీయే గెలుస్తుందని ఇండియ టు డే సర్వేలో తేలింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సర్వేలన్నీ నూరుశాతం నిజమనేందుకు కూడా లేదు.
ఎందుకంటే ఏపీలో ఎన్నికలు జరిగేందుకు ఇంకా రెండున్నరేళ్ళుంది. అప్పటికి పరిస్దితుల్లో ఏమి మార్పొస్తుందో ఎవరు చెప్పలేరు. పైగా ఇపుడు వెల్లడైన మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు ఎప్పుడు సర్వే చేసినవో తెలీదు. కాకపోతే జనాల నాడి ఎలాగుంది అనే అంచనాకు మాత్రం రావచ్చంతే. అయితే, ఏపీలో పరిణామాలు మాత్రం ఇంకోరకరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రను ఓటీఎస్ కుదిపేస్తోంది. విశాఖను ఉక్కు ఉద్యమం వేధిస్తోంది. గోదావరి జిల్లాల పోలవరం ఆశ తీరలేదు. గుంటూరు-కృష్ణా-ప్రకాశం వాళ్ల రాజధాని కల కరిగిపోయింది. రాయలసీమ నీళ్లు, వరద సాయం లేదు. అన్నింటికి మించి ఓటీఎస్ స్కీం, పింఛన్లు పెంచకపోవడం, ఇసుక మద్యం, నిర్మాణ రంగంలో ఉపాధి పోవడం… ఇన్నింటి నేపథ్యంలో ఈ సర్వే లో జగన్ కే సీట్లు వస్తాయని చెప్పడం కాస్త ఆశ్చర్యమే. అంటే జగన్ పథకాలు ఈ సమస్యలను అధిగమించాయా? లేకపోతే ఈ సర్వే ఏమన్నా…. !!!!
This post was last modified on January 21, 2022 12:14 pm
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…
నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…