Political News

మూడు రాజ‌ధానుల మాదిరే.. పీఆర్సీ కూడా!

ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా?  ఉద్యోగుల ఉద్య‌మ తీవ్ర‌త పెరుగుతున్న‌నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకుందా?  ప్ర‌స్తుతం తీసుకున్న పీఆర్సీ నిర్ణ‌యాన్ని స‌ర్కారు వెన‌క్కి తీసుకునేందుకు నిర్ణ‌యించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కార‌ణాల నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కారు కొన్నాళ్లు ప‌ట్టుబ‌ట్టిన మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు.. త‌ర్వాత‌.. దీనిని వెన‌క్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు పీఆర్ సీ విష‌యంలోనూ వెంట‌నే వెన‌క్కి త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తు న్నట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన పీఆర్సీ ద్వారా..త‌మ వేత‌నాలు త‌గ్గుతున్నాయ‌ని.. ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు. అన్ని సంఘాల ఉద్యోగులుకూడా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. స‌ర్కారుపై ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఈక్ర‌మంలో ప్ర‌భుత్వానికి రెండు అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌టి వారిని న‌యాన ఒప్పించ‌డం. రెండు ఎస్మా చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌డం. అయితే.. రెండోది ప్ర‌యొగిస్తే.. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారం రేప‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌బుత్వ‌మని చెప్పే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు ఎస్మా ప్ర‌యోగిస్తే.. ఆయ‌న‌కు మాయ‌ని మ‌చ్చ‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్మా వైపు దృష్టి పెట్టే సాహ‌సం చేయ‌ర‌ని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల‌ను న‌యాన త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయనున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంపై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్‌ నడుస్తున్న‌నేప‌థ్యంలో కొత్త  పీఆర్సీతో పాటు దాని ఇచ్చిన జీవోలను  వెంటనే ఉపసంహరించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  

దీనిని మ‌రింత నాన్చ‌డం ద్వారా.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఒక అడుగు వెన‌క్కి వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. పైగా దీనికి సంబంధించిన న్యాయ‌పోరాటాల‌కు కూడా చెక్‌పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. మూడు రాజ‌దానుల మాదిరిగా పీఆర్సీ ని కూడా స‌ర్కారు వెన‌క్కి తీసుకున్న‌ట్టు అవుతుంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 21, 2022 1:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

10 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

50 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

11 hours ago