Political News

మూడు రాజ‌ధానుల మాదిరే.. పీఆర్సీ కూడా!

ఏపీ సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారా?  ఉద్యోగుల ఉద్య‌మ తీవ్ర‌త పెరుగుతున్న‌నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేయాల‌ని నిర్ణ‌యించుకుందా?  ప్ర‌స్తుతం తీసుకున్న పీఆర్సీ నిర్ణ‌యాన్ని స‌ర్కారు వెన‌క్కి తీసుకునేందుకు నిర్ణ‌యించిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని కార‌ణాల నేప‌థ్యంలో రాష్ట్ర స‌ర్కారు కొన్నాళ్లు ప‌ట్టుబ‌ట్టిన మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన స‌ర్కారు.. త‌ర్వాత‌.. దీనిని వెన‌క్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు పీఆర్ సీ విష‌యంలోనూ వెంట‌నే వెన‌క్కి త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తు న్నట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన పీఆర్సీ ద్వారా..త‌మ వేత‌నాలు త‌గ్గుతున్నాయ‌ని.. ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు. అన్ని సంఘాల ఉద్యోగులుకూడా ఏక‌తాటిపైకి వ‌చ్చి.. స‌ర్కారుపై ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఈక్ర‌మంలో ప్ర‌భుత్వానికి రెండు అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌టి వారిని న‌యాన ఒప్పించ‌డం. రెండు ఎస్మా చ‌ట్టాన్ని ప్ర‌యోగించ‌డం. అయితే.. రెండోది ప్ర‌యొగిస్తే.. ఇది రాష్ట్రంలో తీవ్ర దుమారం రేప‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ముఖ్యంగా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌బుత్వ‌మని చెప్పే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇప్పుడు ఎస్మా ప్ర‌యోగిస్తే.. ఆయ‌న‌కు మాయ‌ని మ‌చ్చ‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్మా వైపు దృష్టి పెట్టే సాహ‌సం చేయ‌ర‌ని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల‌ను న‌యాన త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయనున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంపై అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు వార్‌ నడుస్తున్న‌నేప‌థ్యంలో కొత్త  పీఆర్సీతో పాటు దాని ఇచ్చిన జీవోలను  వెంటనే ఉపసంహరించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.  

దీనిని మ‌రింత నాన్చ‌డం ద్వారా.. ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. ఒక అడుగు వెన‌క్కి వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. పైగా దీనికి సంబంధించిన న్యాయ‌పోరాటాల‌కు కూడా చెక్‌పెట్టాల‌ని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. మూడు రాజ‌దానుల మాదిరిగా పీఆర్సీ ని కూడా స‌ర్కారు వెన‌క్కి తీసుకున్న‌ట్టు అవుతుంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 21, 2022 1:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago