Political News

వైసీపీని చిత్తుగా ఓడిస్తారట

ఉప ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తానంటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలెంజ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ప్రతిపక్ష పార్టీల సహకారంతో నరసాపురం ఎంపీగా మళ్ళీ గెలుస్తానంటు ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీవరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీకి గడువు ఇస్తున్నట్లు ఎంపీ మరోసారి చెప్పారు. తన రాజీనామాను ఆమోదించవద్దని లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ రాయటాన్ని ఎద్దేవా చేశారు.

తన రాజీనామా అంటేనే అధికార పార్టీ వణికిపోతోందన్నారు. తన రాజీనామా ద్వారా వచ్చే ఉపఎన్నికలో వైసీపీ తరపున ఎవరిని పోటీ చేయిస్తారో చూడాలన్నారు. తన రాజీనామాను ఆమోదించవద్దని వైసీపీ ఎందుకు కోరుతోందో అర్థం కావటం లేదన్నారు. మొత్తానికి ఎంపీది ధీమానో లేకపోతే మేకపోతు గాంభీర్యమో అర్థం కావటం లేదు. తనను సస్పెండ్ చేయటానికో లేకపోతే అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎంపీ ఆరోపణ కొంతే కరెక్టు. సస్పెండ్ చేయాలని అనుకుంటే ఆ పని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసుండేవారు.

ఎంపీపై అనర్హత వేటు వేయించాలన్నదే జగన్ పట్టుదలగా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎంపీ ఫ్రీ అయిపోతారు. అదే అనర్హత వేటు వేయిస్తే ఎంపీ పదవినే కోల్పోతారు. అందుకనే అనర్హత వేటు వేయించేందుకే గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ ఉపఎన్నికలు రావటం ఖాయం. అప్పుడు జగన్, రాజు గారిలో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది. ప్రతిపక్షాల మద్దతుతో పోటీ చేసి గెలుస్తా అని చెప్పారే కానీ తాను ఏ పార్టీలో చేరుతాననే వియాన్ని మాత్రం ఎంపీ చెప్పలేదు. జరుగుతున్న ప్రచారమైతే జనసేనలో కానీ లేదా బీజేపీలో కానీ చేరుతారని.

పై రెండు పార్టీల్లో దేనిలోనో ఒకదానిలో చేరి టీడీపీ మద్దతు తీసుకుంటారనే ప్రచారం  కూడా జరుగుతోంది. అయితే ఎంపీ ఇపుడు వేసుకుంటున్న ప్లాన్లన్నీ రేపు ఆచరణలోకి వస్తాయనేందుకు గ్యారెంటీ ఏమీ లేదు. బీజేపీలో చేరి పోటీ చేస్తే ఆ పార్టీ నేతలు టీడీపీ మద్దతు తీసుకునేందుకు నిరాకరించవచ్చు. అలాగే జనసేనలో చేరినా ఇదే సమస్య ఎదురైతే ఎంపీ చేయగలిగేదేమీ ఉండదు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి అన్నీ పార్టీల మద్దతు తీసుకోవాలన్నా సాధ్యం కాకపోవచ్చు. అయినా తన గెలుపుపై అంత ధీమా నిజంగానే ఉంటే డెడ్ లైన్లు ఎందుకు వెంటనే రాజీనామా చేసేస్తే పోలా. డైరెక్టుగానే బరిలోకి దిగి తన సత్తా ఏమిటో చూపించి జగన్ నోరు మూయించచ్చు కదా. 

This post was last modified on January 20, 2022 3:57 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

9 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

10 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

11 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

12 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

12 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

14 hours ago