Political News

జగన్ గుర్తించకపోతే అంతే సంగతులు

ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు.

రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ తగ్గినా అంగీకరించారు. అంతేకానీ సంవత్సరాల తరబడి ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించేస్తామని అంటే ఎందుకు ఒప్పుకుంటారు ? ఇపుడు జరుగుతున్నదిదే. ఆందోళనకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన హెచ్ఆర్ఏ అసంబంద్ధంగా ఉంది. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే 24 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తామని చెప్పటమే పెద్ద జోక్. అసలు రాష్ట్రం మొత్తం మీద 50 లక్షలున్న నగరమే లేదు. మరిలాంటి నిబంధన పెట్టడమంటే ఉద్యోగులను రెచ్చగొటడ్డమే కదా.

పనిలోపనిగా హెచ్ఆర్ఏ శ్లాబులన్నింటినీ మార్చేసింది. ప్రతిశ్లాబూ ఉద్యోగులకు నష్టాన్నే కలిగిస్తుంది. అలాగే సీసీఏ పూర్తిగా రద్దు చేసింది. ఇకనుండి రాష్ట్రస్థాయిలో పీఆర్సీ కాకుండా కేంద్రం పద్ధతిలో వేతన సవరణ చేస్తామని చెప్పింది. పీఆర్సీ అంటే ఐదేళ్ళకొకసారి వేస్తారు. అదే కేంద్రం పద్దతంటే పదేళ్ళకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. మొత్తం మీద ప్రభుత్వం అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగానే వెళుతోందనేది స్పష్టమైపోయింది. ఇక్కడ ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారా ? లేకపోతే జగనే తప్పు చేస్తున్నారా అన్నది పాయింట్ కాదు.

తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సింది జగనే. రేపు ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఎదురుతిరిగితే నష్టపోయేది జగనే కానీ ఉన్నతాధికారులు కాదు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఆడుకోవటం చాలా తప్పు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు జరిగే నష్టం జగన్ కే కానీ ఇంకెవరికీ కాదు. ఇప్పటికైనా జగన్ మేల్కోనకపోతే అంతే సంగతులు. 

This post was last modified on January 19, 2022 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

18 minutes ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

1 hour ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

1 hour ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

1 hour ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

1 hour ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

2 hours ago