ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తప్పే చేస్తున్నారు. అదనంగా ఇవ్వకపోయినా ఉద్యోగులు ఏదోలా సర్దుకుంటారు కానీ చేతిలో ఉన్నది కూడా లాక్కుంటానంటే ఎందుకు ఊరుకుంటారు ? ఇపుడు జగన్ ప్రభుత్వం చేసిందిదే. ఉద్యోగ సంఘాల నేతలను అనవసరంగా రెచ్చగొడుతోంది ప్రభుత్వం. పీఆర్సీ విషయంలో కోత పెట్టినా అదనంగా రెండు అడ్వాంటేజెస్ వచ్చాయి కాబట్టి సర్దుకున్నారు.
రిటైర్మెంట్ వయసు పెంచటం, ఇళ్ల స్థలాల్లో ప్రాధాన్యత, రాయితీలని జగన్ చెబితే ఫిట్మెంట్ తగ్గినా అంగీకరించారు. అంతేకానీ సంవత్సరాల తరబడి ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించేస్తామని అంటే ఎందుకు ఒప్పుకుంటారు ? ఇపుడు జరుగుతున్నదిదే. ఆందోళనకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన హెచ్ఆర్ఏ అసంబంద్ధంగా ఉంది. 50 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే 24 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తామని చెప్పటమే పెద్ద జోక్. అసలు రాష్ట్రం మొత్తం మీద 50 లక్షలున్న నగరమే లేదు. మరిలాంటి నిబంధన పెట్టడమంటే ఉద్యోగులను రెచ్చగొటడ్డమే కదా.
పనిలోపనిగా హెచ్ఆర్ఏ శ్లాబులన్నింటినీ మార్చేసింది. ప్రతిశ్లాబూ ఉద్యోగులకు నష్టాన్నే కలిగిస్తుంది. అలాగే సీసీఏ పూర్తిగా రద్దు చేసింది. ఇకనుండి రాష్ట్రస్థాయిలో పీఆర్సీ కాకుండా కేంద్రం పద్ధతిలో వేతన సవరణ చేస్తామని చెప్పింది. పీఆర్సీ అంటే ఐదేళ్ళకొకసారి వేస్తారు. అదే కేంద్రం పద్దతంటే పదేళ్ళకు ఒకసారి వేతన సవరణ జరుగుతుంది. మొత్తం మీద ప్రభుత్వం అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగానే వెళుతోందనేది స్పష్టమైపోయింది. ఇక్కడ ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారా ? లేకపోతే జగనే తప్పు చేస్తున్నారా అన్నది పాయింట్ కాదు.
తప్పు ఎవరు చేసినా బాధ్యత వహించాల్సింది జగనే. రేపు ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వానికి ఎదురుతిరిగితే నష్టపోయేది జగనే కానీ ఉన్నతాధికారులు కాదు. ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఆడుకోవటం చాలా తప్పు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు జరిగే నష్టం జగన్ కే కానీ ఇంకెవరికీ కాదు. ఇప్పటికైనా జగన్ మేల్కోనకపోతే అంతే సంగతులు.
This post was last modified on January 19, 2022 10:59 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…