ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారు.. మిగిలిన పనుల విషయంలో ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం మహా చురుగ్గా ఉండటం కనిపిస్తుంది. తానుస్పందించాల్సిన కీలక విషయాల్ని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి ఒక్క క్లిక్ తో చేర్చేసే సోషల్ మీడియాను కీలక మాధ్యమంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచమంతా ఒకలా వ్యవహరిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పాలి.
ఆయన వ్యక్తిగత ట్విటర్ ఖాతాను చూస్తే.. ఒక్కోసారి వరుస పెట్టి రోజూ ట్వీట్లు చేయటం కనిపిస్తుంది. ఒక్కోసారి రోజుకో ట్వీట్ చొప్పున పోస్టు చేసే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో నాలుగైదు రోజులు గడిచినా మరే ట్వీట్ పెట్టటం కనిపించదు. అలాంటి ఆయన తాజాగా స్పందించారు. ఆయన తన చివరి ట్వీట్ ను సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన నుంచి ఎలాంటి ట్వీట్ పోస్టు కాలేదు.
తాజాగా ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు కరోనా టెస్టులో పాజిటివ్ రావటం.. ఆయన ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా చంద్రబాబుకు పాజిటివ్ అన్న అంశంపై స్పందించిన సీఎం జగన్.. త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరారు. జనవరి 14 తర్వాత ఆయన చేసిన మొదటి ట్వీట్ ఇదే కావటం గమనార్హం. ‘చాలా త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను చంద్రబాబు గారు అంటూ పేర్కొన్నారు. మొత్తానికి మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకు పాజిటివ్ అయిన వెంటనే.. జగన్ రియాక్టు కావటం గమనార్హం.
This post was last modified on January 18, 2022 12:16 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…