Political News

కోర్టులో కేసు వేసిన ఎంపీ రఘురామ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో కేసు వేశారు. తనపై ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలన్నారు. తనపై దురుద్దేశ్యంతో సీఐడీ ఏడీజీ పెట్టిన కేసు కాబట్టి దానికి విచారణ అర్హత లేదని రాజు తన పిటీషన్లో చెప్పారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కూడా కొట్టేయాలని, తనను విచారణ పేరుతో ఇకముందు నోటీసులు కూడా ఇవ్వకుండా సీఐడీని నిలుపుదల చేయాలని కూడా ఎంపీ తన పిటిషన్లో అభ్యర్ధించారు.

మొన్నటి 11వ తేదీన హైదరాబాద్ లో ఎంపీని కలిసిన సీఐడీ అధికారులు విచారణకు హాజరవ్వాలంటు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అయితే పండగ సమయంలో విచారణకు సాధ్యం కాదని చెప్పిన ఎంపీ 17వ తేదీ మంగళగిరిలో సీఐడీ ఆఫీసుకు వస్తానని చెప్పారు. దాంతో అధికారులు కూడా అంగీకరించారు.

అయితే అదేరోజు ఎంపి ఢిల్లీకి వెళ్ళి తన లాయర్లను కలిశారు. అప్పటినుండి మళ్ళీ ఏపికి తిరిగి రాలేదు. పైగా తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని సీఐడీ లేఖ రాశారు. తన పిటీషన్ పై కోర్టు  ఏదో నిర్ణయం  తీసుకునేంతవరకు ఎంపీ సీఐడీకి అందుబాటులోకి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లున్నారు.   

తనపై సీఐడీ పెట్టిన, పెడుతున్న కేసులను ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా ఎంపీ వివరించారు. సీఐడీ ఉన్నతాధికారి సునీల్ కుమార్ ను వెంటనే ఏపీ క్యాడర్ నుంచి ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కూడా కోరారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తనకు చాలా అవసరమన్నారు. అప్పటి వరకు తాను జీవించి ఉండాలని ఎంపీ మీడియాతో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  

This post was last modified on January 18, 2022 12:13 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

5 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

5 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

6 hours ago