రాజకీయాల్లో ఉన్నా కూడా మరీ వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయకుండా అందరితో సఖ్యతతోనే కనిపిస్తూ ఉంటుంది తమిళ నటి ఖుష్బూ. కొన్నేళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా వాళ్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఐతే తాజాగా ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మీడియాకు యాంటీగా మార్చేశాయి. ఓ ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె.. మీడియా వాళ్ల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది.
మీడియా వాళ్లు ఎప్పుడూ వార్తల కోసం కాచుకుని ఉంటారని.. ఇన్నాళ్లు వాళ్ల దృష్టంతా కరోనా వైరస్ చుట్టూనే ఉందని.. ఇప్పుడు కోవిడ్-19 మీద జనాల ఆసక్తి తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ల దృష్టి సినిమా వాళ్లపై పడుతుందని ఆమె అంది. కాబట్ట ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. మన ఫొటోలు, వీడియోల కోసం చూస్తారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఖుష్బు ఫోన్ కాల్లో వ్యాఖ్యానించింది.
ఇంకా మీడియా వాళ్ల గురించి ప్రతికూలంగా ఆమె మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఖుష్బూ బద్నాం అయిపోయింది. మీడియా వాళ్లు ఈ వ్యాఖ్యలన్న విని ఖుష్బు మీద గుర్రుగా ఉన్నారు.
ఐతే ఇలాంటి ఆడియోలు, వీడియోలు బయటపడినపుడు ఎవరైనా ఎలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారో.. ఖుష్బు కూడా అదే చేసింది. ఈ ఆడియోలో వినిపించింది పూర్తిగా నిజం కాదని.. తన వ్యాఖ్యల్ని కొంత వరకు కృత్రిమంగా జోడించారని ఆమె ఆరోపించింది.
ఈ ఆడియోను లీక్ చేసిన నాయకుడెవరో కూడా తెలుసంటూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీ హ్యాండ్ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఐతే ఖుష్బూ ఎంత కవర్ చేసినా.. మీడియా వాళ్ల దృష్టిలో మాత్రం విలన్ అయిపోయింది.
This post was last modified on June 12, 2020 8:39 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…