రాజకీయాల్లో ఉన్నా కూడా మరీ వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయకుండా అందరితో సఖ్యతతోనే కనిపిస్తూ ఉంటుంది తమిళ నటి ఖుష్బూ. కొన్నేళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా వాళ్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఐతే తాజాగా ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మీడియాకు యాంటీగా మార్చేశాయి. ఓ ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె.. మీడియా వాళ్ల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది.
మీడియా వాళ్లు ఎప్పుడూ వార్తల కోసం కాచుకుని ఉంటారని.. ఇన్నాళ్లు వాళ్ల దృష్టంతా కరోనా వైరస్ చుట్టూనే ఉందని.. ఇప్పుడు కోవిడ్-19 మీద జనాల ఆసక్తి తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ల దృష్టి సినిమా వాళ్లపై పడుతుందని ఆమె అంది. కాబట్ట ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. మన ఫొటోలు, వీడియోల కోసం చూస్తారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఖుష్బు ఫోన్ కాల్లో వ్యాఖ్యానించింది.
ఇంకా మీడియా వాళ్ల గురించి ప్రతికూలంగా ఆమె మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఖుష్బూ బద్నాం అయిపోయింది. మీడియా వాళ్లు ఈ వ్యాఖ్యలన్న విని ఖుష్బు మీద గుర్రుగా ఉన్నారు.
ఐతే ఇలాంటి ఆడియోలు, వీడియోలు బయటపడినపుడు ఎవరైనా ఎలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారో.. ఖుష్బు కూడా అదే చేసింది. ఈ ఆడియోలో వినిపించింది పూర్తిగా నిజం కాదని.. తన వ్యాఖ్యల్ని కొంత వరకు కృత్రిమంగా జోడించారని ఆమె ఆరోపించింది.
ఈ ఆడియోను లీక్ చేసిన నాయకుడెవరో కూడా తెలుసంటూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీ హ్యాండ్ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఐతే ఖుష్బూ ఎంత కవర్ చేసినా.. మీడియా వాళ్ల దృష్టిలో మాత్రం విలన్ అయిపోయింది.
This post was last modified on June 12, 2020 8:39 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…