Political News

మీడియాపై ఖుష్బూ వ్యాఖ్యల దుమారం

రాజకీయాల్లో ఉన్నా కూడా మరీ వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయకుండా అందరితో సఖ్యతతోనే కనిపిస్తూ ఉంటుంది తమిళ నటి ఖుష్బూ. కొన్నేళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా వాళ్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.

ఐతే తాజాగా ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మీడియాకు యాంటీగా మార్చేశాయి. ఓ ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె.. మీడియా వాళ్ల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది.

మీడియా వాళ్లు ఎప్పుడూ వార్తల కోసం కాచుకుని ఉంటారని.. ఇన్నాళ్లు వాళ్ల దృష్టంతా కరోనా వైరస్ చుట్టూనే ఉందని.. ఇప్పుడు కోవిడ్-19 మీద జనాల ఆసక్తి తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ల దృష్టి సినిమా వాళ్లపై పడుతుందని ఆమె అంది. కాబట్ట ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. మన ఫొటోలు, వీడియోల కోసం చూస్తారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఖుష్బు ఫోన్ కాల్‌లో వ్యాఖ్యానించింది.

ఇంకా మీడియా వాళ్ల గురించి ప్రతికూలంగా ఆమె మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఖుష్బూ బద్నాం అయిపోయింది. మీడియా వాళ్లు ఈ వ్యాఖ్యలన్న విని ఖుష్బు మీద గుర్రుగా ఉన్నారు.

ఐతే ఇలాంటి ఆడియోలు, వీడియోలు బయటపడినపుడు ఎవరైనా ఎలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారో.. ఖుష్బు కూడా అదే చేసింది. ఈ ఆడియోలో వినిపించింది పూర్తిగా నిజం కాదని.. తన వ్యాఖ్యల్ని కొంత వరకు కృత్రిమంగా జోడించారని ఆమె ఆరోపించింది.

ఈ ఆడియోను లీక్ చేసిన నాయకుడెవరో కూడా తెలుసంటూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీ హ్యాండ్ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఐతే ఖుష్బూ ఎంత కవర్ చేసినా.. మీడియా వాళ్ల దృష్టిలో మాత్రం విలన్ అయిపోయింది.

This post was last modified on June 12, 2020 8:39 am

Share
Show comments
Published by
Satya
Tags: KushbooMedia

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

28 minutes ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

1 hour ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

2 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

3 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

3 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

6 hours ago