రాజకీయాల్లో ఉన్నా కూడా మరీ వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయకుండా అందరితో సఖ్యతతోనే కనిపిస్తూ ఉంటుంది తమిళ నటి ఖుష్బూ. కొన్నేళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మీడియా వాళ్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
ఐతే తాజాగా ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు మీడియాకు యాంటీగా మార్చేశాయి. ఓ ఫ్రెండుతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె.. మీడియా వాళ్ల గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది.
మీడియా వాళ్లు ఎప్పుడూ వార్తల కోసం కాచుకుని ఉంటారని.. ఇన్నాళ్లు వాళ్ల దృష్టంతా కరోనా వైరస్ చుట్టూనే ఉందని.. ఇప్పుడు కోవిడ్-19 మీద జనాల ఆసక్తి తగ్గిపోయిందని.. ఈ నేపథ్యంలో మీడియా వాళ్ల దృష్టి సినిమా వాళ్లపై పడుతుందని ఆమె అంది. కాబట్ట ఉన్నవి లేనివి కల్పించి రాస్తారని.. మన ఫొటోలు, వీడియోల కోసం చూస్తారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఖుష్బు ఫోన్ కాల్లో వ్యాఖ్యానించింది.
ఇంకా మీడియా వాళ్ల గురించి ప్రతికూలంగా ఆమె మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దీంతో ఖుష్బూ బద్నాం అయిపోయింది. మీడియా వాళ్లు ఈ వ్యాఖ్యలన్న విని ఖుష్బు మీద గుర్రుగా ఉన్నారు.
ఐతే ఇలాంటి ఆడియోలు, వీడియోలు బయటపడినపుడు ఎవరైనా ఎలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారో.. ఖుష్బు కూడా అదే చేసింది. ఈ ఆడియోలో వినిపించింది పూర్తిగా నిజం కాదని.. తన వ్యాఖ్యల్ని కొంత వరకు కృత్రిమంగా జోడించారని ఆమె ఆరోపించింది.
ఈ ఆడియోను లీక్ చేసిన నాయకుడెవరో కూడా తెలుసంటూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీ హ్యాండ్ ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఐతే ఖుష్బూ ఎంత కవర్ చేసినా.. మీడియా వాళ్ల దృష్టిలో మాత్రం విలన్ అయిపోయింది.
This post was last modified on June 12, 2020 8:39 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…