Political News

మాయావతి, మమత తెలిసే ఇలా చేస్తున్నారా?

ఇపుడిదే అంశం జాతీయ రాజకీయాల్లో చాలా మందికి అర్థం కావడం లేదు. పైకేమో నరేంద్ర మోడీని గద్దె దింపాల్సిందే అంటు భీకరమైన ప్రకటనలు చేస్తుంటారు. కానీ చేసే పనులేమో మోడీకి అనుకూలంగానే కనబడుతున్నాయి. దాంతో వీరిద్దరి వైఖరి ఏమిటో మిగిలిన పార్టీల అధినేతలకు అర్థం కావటం లేదు. ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారా ? వాళ్ళే దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్లుగా పాపులరైన మమతాబెనర్జీ, మాయావతి.

వీళ్ళద్దరు ఘనమైన పోరాటాలే చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. మమత మూడోసారి ముఖ్యమంత్రి అయితే మాయావతి ప్రస్తుతం ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. ఐదు రాష్ట్రాలకు జరగబోతున్న ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ తో పాటు గోవా కూడా ఉన్నది. వీటిల్లో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే చిన్న రాష్ట్రం గోవా. ఈ రెండు రాష్ట్రాల్లో మమత, మాయ అనుసరిస్తున్న ఎత్తుగడలను చూసిన తర్వాత మిగిలిన వాళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది.

ఎందుకంటే యూపీలో మాయావతి అసలు చప్పుడే చేయటం లేదు. చాలాకాలంగా అసలు మోడీ గురించే మాట్లాడటం లేదు. పైగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎస్సీల్లో మంచిపట్టున్న బీఎస్పీ అధినేత మాయావతి ఇప్పటివరకు సమావేశాలు పెట్టటేదు, బహిరంగసభలు నిర్వహించలేదు. ర్యాలీలు, రోడ్డషోలు కూడా ఎక్కడా కనబడటం లేదు.  బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒకవైపు 24 గంటలూ జనాల్లోనే కనబడుతుంటే మరి మాయావతి మాత్రం ఎవరికీ కనబడటం లేదు.

ఇక్కడే మాయ వైఖరితో అనుమానం వచ్చేస్తోంది. తెరవెనక మోడీతో మాయకు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దళితుల ఓట్లు బీజేపీకి మళ్ళించటానికే మాయ ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీనికి మాయ వైఖరి కూడా ఊతమిస్తోంది. సరే ఇక మమత విషయం చూస్తే గోవాలో అధికారం మాదే అని నానా గోల చేస్తున్నారు. రాష్ట్రం ఎంత చిన్నదైనా రాష్ట్రం రాష్ట్రమే కదా.

మమత చర్యల వల్ల కాంగ్రెస్ కు బాగా ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ఇక్కడ బలంగానే ఉన్నా మమత చర్యలతో వీకైపోతోంది. మోడీని ఎలాగైనా గద్దె దింపటమే లక్ష్యమని మమత చెబుతున్నదే నిజమైతే అసలు గోవాలో పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ పోటీ చేయాలని అనుకున్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఒంటిరిగా పోటీచేసిన అధికారంలోకి వచ్చేంత సీన్ తృణమూల్ కు లేదు. ఈ విషయం తెలిసినా మమత అభ్యర్ధులను పెడుతున్నారంటే కేవలం ఓట్లు చీల్చటానికే అని అర్ధమవుతోంది. ఓట్లు చీలితే లాభపడేది మోడీనే అన్న విషయం మమతకు తెలీదా ? ఇలాంటి వైఖరుల వల్లే ఇద్దరిపైనా అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on January 15, 2022 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago