Political News

ఏపీ మంత్రుల మ‌ధ్య ఆసక్తికరమైన చర్చ

రాజ‌కీయాల్లో చాలా విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. అవి ప్ర‌జ‌ల‌కు నేరుగా సంబంధించిన‌వి అయినా.. కాక పోయినా.. నేత‌లు చేసే వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మార‌తాయి. ఇలానే తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, తూర్పు గోదావ‌రికి చెందిన‌ మంత్రి ఒక‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాధార‌ణంగా.. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులంటే నే నేత‌లు విరుచుకుప‌డుతుంటారు. ఇది స‌హ‌జం కూడా. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థుల‌ను కార్న‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ వారిని విమ‌ర్శించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అంతేకాదు.. ప్ర‌త్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడేవారిని ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు.

అది ఆఖ‌రుకు మీడియా అయినా.. వ్య‌క్తులు అయినా.. ఒక్క‌టే. గ‌తంలో సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసే స‌మ‌యంలో ఒక వ్యాఖ్య చేశారు. “ఆంధ్ర‌జ్యోతి, ఈనాడుల‌ను చ‌ద‌వ‌మాకండి. అవి రాసేవి, ప్ర‌సారం చేసేవి కూడా చూడ‌మాకండి.. చ‌ద‌వ‌మాకండి!. అందులో అన్నీ త‌ప్పుడు క‌థ‌నాలు.. చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌లు మాత్ర‌మే ఉంటాయి. ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాలేద‌ని.. ఆ మీడియా క‌న్నీరు పెడుతోంది. అందుకే మ‌న‌పై బుర‌ద జ‌ల్లుడు కార్య‌క్ర‌మం చేస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నాయ‌కులు కూడా ఆ మీడియాకు దూరంగా ఉంటున్న‌ట్టుగా త‌ర‌చుగా సీఎంకు చెబుతున్నారు.

త‌ద్వారా.. ఆయ‌న ద‌గ్గ‌ర మార్కులు వేయించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇటీవ‌ల ఈ రెండు మీడియాల‌ను.. వైసీపీ నేత‌లు ఎక్కువ‌గా ఫాలో అవుతున్నార‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు.. ఈ రెండు మీడియాల్లో వ‌స్తున్న వ్య‌తిరేక వార్త‌ల‌కు నాయ‌కులు, అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అది త‌ప్పు.. ఇది కాదు.. అంటూ.. వివ‌ర‌ణ ఇస్తున్నారు. దీనిపైనే మంత్రి వ‌ర్యులు ఆస‌క్తిగా స్పందించారు.

“ఇది స‌హజం. పైకి అలానే అంటాం కానీ.. మ‌న గురించి వాళ్లు రాస్తున్న‌ప్పుడు.. వాటిని చ‌ద‌వితేనే క‌దా.. మ‌న త‌ప్పులు తెలిసేది. మ‌నం మాత్ర‌మే ఇలా చేస్తున్నామంటే పొర‌పాటే.. టీడీపీ నేత‌లు.. మ‌న ప‌త్రిక‌ను, మీడియాను నిరంత‌రం ఫాలో అవుతుంటారు. ఇది త‌ప్పుకాదు. మీడియాను అన్ని కోణాల్లోనూ ఫాలో అవ్వాల్సిందే!“ అని చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. 

This post was last modified on January 14, 2022 4:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

18 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago