నర్సీపట్నం వైద్యుడు డా. సుధాకర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మాస్కుల గురించి మీడియా ముందు ప్రశ్నించిన కొద్ది రోజులకే సస్పెండైన ఆయన చాలాకాలం కనిపించలేదు. సడెన్ గా ఓ రోజు వైజాగ్ నడిరోడ్లో కనిపించారు. కారులో నుంచి దిగడం, జగన్ ని తిట్టడం, పోలీసులు తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టడం, తన్ని కింద పడేయడం, ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చడం… హైకోర్టు ఆయన కేసును సీబీఐకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
అయితే సడెన్ గా ఈరోజు ట్విస్ట్ ఇచ్చాడు డా.సుధాకర్. జగన్ దేవుడు అని, రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని, రాజకీయాల కోసం నన్నెవరూ వాడుకోలేదన్నారు. చంద్రబాబు, జగన్ అందరూ బాగా పాలిస్తున్నారని మరో చిత్రమైన సంబంధం లేని కామెంట్ కూడా చేశారు. మొన్న ఆస్పత్రిలో డిశ్చార్జి అయ్యే వరకు ఒక వెర్షను వినిపించిన సుధాకర్ డిశ్చార్జి అయినా కొద్ది రోజులకే ఇలా కొత్త వెర్షనులో మాట్లాడటం వెనుక ఏం జరిగిందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు దీని వెనుక వ్యవహారమేంటో తమ రాజకీయ జ్జానంతో ఒక అంచనాకు వస్తున్నారు.
కోర్టు కేసును సీబీఐకి ఇచ్చిన అనంతరం సుధాకర్ తల్లి చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రస్తావనార్హం. మా కొడుక్కి ఉద్యోగం తిరిగి ఇస్తామన్నారు. మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. కానీ ఇపుడు వెనకడుగు వేస్తే మాకు అండగా నిలిచి వారిని అవమానించినట్టు అవుతుంది. అందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని ఆమె వ్యాఖ్యానంచారు. ఎపుడైతే సీబీఐ విచారణ మొదలైందో అప్పటి నుంచి అందరూ సైలెంటుగా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. మరిపుడు ఏం జరిగింది. ఎందుకు సుధాకర్ సడెన్ గా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు?
మరికొన్ని విషయాలను కూడా సుధాకర్ ప్రస్తావించారు. ’’సస్పెండ్ అయినప్పటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఆస్పత్రిలో చంపేస్తామని కూడా బెదిరించారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు. తనకు గుండు గీసిందెవరో చెబితే కొత్త గొడవలు మొదలవుతాయి. పేదల సేవ కోసం డాక్టరుగా పనిచేస్తున్నాను. ఇపుడు జీతం రాక ఇబ్బంది పడుతున్నాను. నా ఉద్యోగం నాకు ఇప్పించండి. రాజకీయాలంటే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం’’ అని సుధాకర్ కొత్తగా మాట్లాడారు.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…