నర్సీపట్నం వైద్యుడు డా. సుధాకర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మాస్కుల గురించి మీడియా ముందు ప్రశ్నించిన కొద్ది రోజులకే సస్పెండైన ఆయన చాలాకాలం కనిపించలేదు. సడెన్ గా ఓ రోజు వైజాగ్ నడిరోడ్లో కనిపించారు. కారులో నుంచి దిగడం, జగన్ ని తిట్టడం, పోలీసులు తాళ్లతో కట్టి లాఠీలతో కొట్టడం, తన్ని కింద పడేయడం, ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చడం… హైకోర్టు ఆయన కేసును సీబీఐకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
అయితే సడెన్ గా ఈరోజు ట్విస్ట్ ఇచ్చాడు డా.సుధాకర్. జగన్ దేవుడు అని, రాజకీయాలతో నాకు సంబంధం లేదు అని, రాజకీయాల కోసం నన్నెవరూ వాడుకోలేదన్నారు. చంద్రబాబు, జగన్ అందరూ బాగా పాలిస్తున్నారని మరో చిత్రమైన సంబంధం లేని కామెంట్ కూడా చేశారు. మొన్న ఆస్పత్రిలో డిశ్చార్జి అయ్యే వరకు ఒక వెర్షను వినిపించిన సుధాకర్ డిశ్చార్జి అయినా కొద్ది రోజులకే ఇలా కొత్త వెర్షనులో మాట్లాడటం వెనుక ఏం జరిగిందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరికి వారు దీని వెనుక వ్యవహారమేంటో తమ రాజకీయ జ్జానంతో ఒక అంచనాకు వస్తున్నారు.
కోర్టు కేసును సీబీఐకి ఇచ్చిన అనంతరం సుధాకర్ తల్లి చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రస్తావనార్హం. మా కొడుక్కి ఉద్యోగం తిరిగి ఇస్తామన్నారు. మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. కానీ ఇపుడు వెనకడుగు వేస్తే మాకు అండగా నిలిచి వారిని అవమానించినట్టు అవుతుంది. అందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని ఆమె వ్యాఖ్యానంచారు. ఎపుడైతే సీబీఐ విచారణ మొదలైందో అప్పటి నుంచి అందరూ సైలెంటుగా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. మరిపుడు ఏం జరిగింది. ఎందుకు సుధాకర్ సడెన్ గా ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు?
మరికొన్ని విషయాలను కూడా సుధాకర్ ప్రస్తావించారు. ’’సస్పెండ్ అయినప్పటి నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. ఆస్పత్రిలో చంపేస్తామని కూడా బెదిరించారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు. తనకు గుండు గీసిందెవరో చెబితే కొత్త గొడవలు మొదలవుతాయి. పేదల సేవ కోసం డాక్టరుగా పనిచేస్తున్నాను. ఇపుడు జీతం రాక ఇబ్బంది పడుతున్నాను. నా ఉద్యోగం నాకు ఇప్పించండి. రాజకీయాలంటే అసహ్యం. ఉద్యోగమే నాకు ముఖ్యం’’ అని సుధాకర్ కొత్తగా మాట్లాడారు.
This post was last modified on June 11, 2020 7:11 pm
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…