Political News

‘బలుపు’ వ్యాఖ్యల వేళ.. చిరుతో జగన్ లంచ్

పిలుస్తారు.. కూర్చెబెడతారు.. మాట్లాడతారు.. తిరిగి వస్తారు. సమస్య తీరదు.. పరిష్కారం లభించదు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇష్యూస్ మొత్తం ఇదేరీతిలో సాగుతూనే ఉంటాయి. సినిమా టికెట్ల పంచాయితీ మొదలు.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

దీనికి తోడు.. ఏపీ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ఏకంగా సినిమా వాళ్లకు బలిసిందంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగుతున్నాయి. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేసినా.. చూసీచూడనట్లుగా ఉండే టాలీవుడ్.. తాజా ‘బలుపు’ మాటల విషయంలో మాత్రం రియాక్టు అవుతోంది.

తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఒకే రోజులో ముగ్గురు సినీ రంగానికి చెందిన వారు రియాక్టు కావటం.. వైసీపీ ఎమ్మెల్యేపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఏపీ ముఖ్యమంత్రి మెగాస్టార్ చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ రోజు (గురువారం)మధ్యాహ్నం భోజన విరామ సమయంలో చిరంజీవితోకలిసి భోజనం  చేస్తారని చెబుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చర్చించే వీలుందని చెబుతున్నారు.

అన్నింటికి మించి సినిమా టికెట్ల వివాదంపై వీరి మధ్య చర్చ జరుగుతుందని చెబుతున్నారు. రోజురోజుకీ వివాదం ముదిరిపోతున్న వేళ.. దీనికి పుల్ స్టాప్ పెట్టేందుకే చిరంజీవి ఒక అడుగు ముందుకు వేసినట్లుగా చెబుతున్నారు. తమ భేటీలో భాగంగా.. సినీ పరిశ్రమపై వైసీపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల ప్రస్తావన కూడా వస్తుందన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న సినీ రంగానికి పెద్దగా తాను వ్యవహరించనని చెప్పిన చిరంజీవి.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on January 13, 2022 11:58 am

Share

Recent Posts

టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…

3 minutes ago

ఎదిగే స్టేజిలో అలాంటి ఆలోచనలే రిస్కు

హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…

1 hour ago

సందీప్ కిషన్ మూవీకి టెన్షన్ లేదు

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…

2 hours ago

అప్పుడు కుటుంబ పేర్లు… ఇప్పుడు వీరుల పేర్లు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…

3 hours ago

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

5 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

5 hours ago