Political News

ఏపీలో రావ‌ణ రాజ్యాన్ని అంతం చేద్దాం: RRR

వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎంపీ ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు.. రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందజేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు రఘురామ తెలిపారు.

”సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ఓ బృందం మా ఇంటికి వచ్చింది. ఈనెల 17న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేపు నరసాపురానికి వస్తున్నానని కలెక్టర్‌, ఎస్పీకి ముందుగానే తెలిపాను. పండగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటి? హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ.. అది అందరికీ తెలుసు. పండగకు వస్తున్నానని తెలిసే ఇప్పుడు నోటీసులు ఇచ్చారా?. ఏపీ సీఐడీ, సీఎం జగన్‌కు పండగ రోజే విచారణ గుర్తొచ్చిందా? పండగ రోజుల్లోనే విచారణ ఎందుకో వాళ్లకే తెలియాలి. చట్టాలు, రాజ్యాంగం, కోర్టులను నమ్మే వ్యక్తిని నేను“ అని ర‌ఘురామ‌ అన్నారు.

“కరోనా ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా విచారణకు హాజరవుతా. గతంలో నన్ను హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవు. నన్ను హింసించిన వీడియోలు చూసి ఎవరు ఆనందపడ్డారో నాకు తెలుసు. నన్ను ఎంతగా హింసించారో ప్రజలకు తెలియాలి. ఎస్సీలపైనా ఎస్సీ కేసులు పెట్టడం చూస్తున్నాం. ఈ రావణ రాజ్యంపై ప్రజలు విసుగెత్తిపోయారు. హీరో ఎవరో.. కీచకుడు ఎవరో తేలుద్దాం. పార్టీలకతీతంగా.. అంతా ఒక్కటై రావణరాజ్యాన్ని అంతం చేద్దాం. అని ర‌ఘురామ పిలుపునిచ్చారు.

హైదరాబాద్లోని ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ముందుగా నోటీసులు తనకు ఇవ్వాలని.. రఘురామ కుమారుడు కోరగా.. ఎంపీకే నోటీసులు ఇస్తామని.. ఏపీ సీఐడీ పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం రఘురామకు నోటీసులు ఇచ్చి.. ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లిపోయారు.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

4 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

5 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

6 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

7 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

8 hours ago