Political News

సరికొత్తగా మోడీ త్రీడీ సభ

అందివచ్చిన సాంకేతికతను, డిజిటల్ విప్లవాన్ని బీజేపీ నూరు శాతం ఉపయోగించుకుంటోంది. ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆర్ధిక వనరులకు ఎలాంటి లోటు లేకపోవటంతో కొత్త విధానాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున వర్చువల్ పద్దతిలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ వర్చువల్ బహిరంగ సభలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

వర్చువల్ విధానంలో త్రీడీ సభలు అంటే ఏమిటి ? ఏమిటంటే మోడీ ఢిల్లీ నుండే మాట్లాడుతారు. యూపీ వ్యాప్తంగా కొన్ని వేల చోట్ల త్రీడీ తెరలను బీజేపీ ఏర్పాటు చేయబోతోంది. ప్రతి తెర ముందు 300 మంది కూర్చుంటారు. లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా మోడీ ఢిల్లీ నుండే మాట్లాడినా ఎవరికి వారు తమ ముందున్న వేదికపై నుండి మోడీ మాట్లాడుతున్నట్లు అనుభూతికి లోనవుతారు. ఒకపుడు జీన్స్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాటకొటి ఈ వర్చువల్ పద్దతిలోనే తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. 

ఒకవైపు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు మరోవైపు భయపెడుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఈనెల 15వ తేదీవరకు ర్యాలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ బ్యాన్ విధించింది. ఆ తర్వాత కూడా ర్యాలీలు, బహిరంగ సభలకు పరిమితిని విధించింది. బహుశా ఈ పరిమితి, బ్యాన్ ముందు ముందు మరింత కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకనే బీజేపీ భారీ బహిరంగ సభలకు ప్రత్యామ్నాయంగా ఈ వర్చువల్ త్రీడీ విధానాన్ని అందిపుచ్చుకుంటోంది.

ఏదేమైనా జనాలకు చేరువ కావటానికి బీజేపీ అందుబాటులో ఉండే ప్రతి అవకాశాన్ని నూరుశాతం ఉపయోగించుకుంటోంది.  ఇప్పటికే పార్టీలో ఐటి వింగ్, సోషల్ మీడియా వింగ్ లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దీనికి అదనంగా టెక్ ఫాగ్ అనే కొత్త యాప్ ను తయారుచేసి అనుమతి లేకుండానే జనాల మొబైళ్ళలోకి బీజేపీ దూరిపోతోందంటు దుమారం రేగుతోంది. మొత్తానికి ప్రత్యర్ధుల్లో ఎవరికీ అందనంత వేగంగా టెక్నాలజీని ఉపయోగంచుకుంటోంది. మరి ఫలితాలు ఎలా ఉంటుందో చూడాల్సిందే.

This post was last modified on January 12, 2022 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago