అందివచ్చిన సాంకేతికతను, డిజిటల్ విప్లవాన్ని బీజేపీ నూరు శాతం ఉపయోగించుకుంటోంది. ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆర్ధిక వనరులకు ఎలాంటి లోటు లేకపోవటంతో కొత్త విధానాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున వర్చువల్ పద్దతిలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ వర్చువల్ బహిరంగ సభలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
వర్చువల్ విధానంలో త్రీడీ సభలు అంటే ఏమిటి ? ఏమిటంటే మోడీ ఢిల్లీ నుండే మాట్లాడుతారు. యూపీ వ్యాప్తంగా కొన్ని వేల చోట్ల త్రీడీ తెరలను బీజేపీ ఏర్పాటు చేయబోతోంది. ప్రతి తెర ముందు 300 మంది కూర్చుంటారు. లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా మోడీ ఢిల్లీ నుండే మాట్లాడినా ఎవరికి వారు తమ ముందున్న వేదికపై నుండి మోడీ మాట్లాడుతున్నట్లు అనుభూతికి లోనవుతారు. ఒకపుడు జీన్స్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ పాటకొటి ఈ వర్చువల్ పద్దతిలోనే తీసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఒకవైపు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు మరోవైపు భయపెడుతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఈనెల 15వ తేదీవరకు ర్యాలీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ బ్యాన్ విధించింది. ఆ తర్వాత కూడా ర్యాలీలు, బహిరంగ సభలకు పరిమితిని విధించింది. బహుశా ఈ పరిమితి, బ్యాన్ ముందు ముందు మరింత కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకనే బీజేపీ భారీ బహిరంగ సభలకు ప్రత్యామ్నాయంగా ఈ వర్చువల్ త్రీడీ విధానాన్ని అందిపుచ్చుకుంటోంది.
ఏదేమైనా జనాలకు చేరువ కావటానికి బీజేపీ అందుబాటులో ఉండే ప్రతి అవకాశాన్ని నూరుశాతం ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే పార్టీలో ఐటి వింగ్, సోషల్ మీడియా వింగ్ లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దీనికి అదనంగా టెక్ ఫాగ్ అనే కొత్త యాప్ ను తయారుచేసి అనుమతి లేకుండానే జనాల మొబైళ్ళలోకి బీజేపీ దూరిపోతోందంటు దుమారం రేగుతోంది. మొత్తానికి ప్రత్యర్ధుల్లో ఎవరికీ అందనంత వేగంగా టెక్నాలజీని ఉపయోగంచుకుంటోంది. మరి ఫలితాలు ఎలా ఉంటుందో చూడాల్సిందే.
This post was last modified on January 12, 2022 1:08 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…