ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. ఒక్కసారిగా కేసీయార్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రముఖుల భేటీలు జరుగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ కీలక నేత డీ రాజా ఇప్పటికే కేసీయార్ తో భేటీ అయ్యారు. తాజాగా బీహార్ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. ఇంతకు ముందే కేసీయార్ చెన్నైకి వెళ్ళి సీఎం ఎకే స్టాలిన్ తో భేటీ అయ్యారు.
కేసీయార్ వరసభేటీలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ చిరకాల స్వప్నం. అయితే కేసీయార్ ను నమ్మి ఎవరు ముందుకు రావటంలేదు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీతో కూడా కేసీయార్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంతమంది తో కేసీయార్ భేటీలైనా, కేసీయార్ ను ఎంతమంది కలుస్తున్నా ఔట్ పుట్ అయితే ఉండటంలేదు.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కేసీయార్ లో స్తిరత్వం లేకపోవటమే. ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. ఒకరితో పొత్తులో ఉన్నపుడే మరో పార్టీ నతేలతో భేటీ అయిన చరిత్ర కేసీయార్ సొంతం. అందుకనే జాతీయస్ధాయిలో కేసీయార్ ను నమ్మటానికి ఎవరు ముందుకు రావటంలేదు. ఈమధ్య కూడా కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించిన మూడు రోజులకే ఢిల్లీ వెళ్ళి మోడి, అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మోడి గురించి ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు.
చాలా కాలంగా ప్రగతి భవన్లో ఎలాంటి హడావుడి లేదు. అలాంటిది ఇపుడు ఒక్కసారిగా ఎందుకు హడావుడి పెరిగిందో అర్ధం కావటంలేదు. నిజానికి దేశవ్యాప్తంగా మోడీ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ప్రత్యామ్నాయం లేకపోవటంతో బీజేపీకే ఓట్లేయక తప్పటంలేదు. ఎన్డీయేయేతర పార్టీల్లో చాలా పార్టీలు తమ రాష్ట్రాల్లో బలంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకుంటున్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా ఏకతాటిపైకి రావాలంటే ఇష్టపడటంలేదు.
ఇపుడు ప్రగతి భవన్లో హడావుడి చూస్తుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవటానికి కేసీయార్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు సాగేట్లు కనబడటంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు మమత, నవీన్, జగన్, కేజ్రీవాల్ తో పాటు తాను కూడా వ్యతిరేకమే. కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయం సాధ్యంకాదు. ఈ విషయం కేసీయార్ కు తెలీకుండానే ఉంటుందా. చూద్దాం ఏమి ప్రయత్నాలు చేస్తున్నారో ?
This post was last modified on January 12, 2022 11:28 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…