Political News

ప్రగతి భవన్లో ఏం జరుగుతోంది ?

ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. ఒక్కసారిగా కేసీయార్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రముఖుల భేటీలు జరుగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ కీలక నేత డీ రాజా ఇప్పటికే కేసీయార్ తో భేటీ అయ్యారు. తాజాగా బీహార్ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. ఇంతకు ముందే కేసీయార్ చెన్నైకి వెళ్ళి సీఎం ఎకే స్టాలిన్ తో భేటీ అయ్యారు.

కేసీయార్ వరసభేటీలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ చిరకాల స్వప్నం. అయితే కేసీయార్ ను నమ్మి ఎవరు ముందుకు రావటంలేదు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీతో కూడా కేసీయార్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఎంతమంది తో కేసీయార్ భేటీలైనా, కేసీయార్ ను ఎంతమంది కలుస్తున్నా ఔట్ పుట్ అయితే ఉండటంలేదు.

దీనికి ప్రధాన కారణం ఏమిటంటే కేసీయార్ లో స్తిరత్వం లేకపోవటమే. ఎప్పుడు ఎవరితో ఎలాగుంటారో కేసీయార్ కే తెలీదు. ఒకరితో పొత్తులో ఉన్నపుడే మరో పార్టీ నతేలతో భేటీ అయిన చరిత్ర కేసీయార్ సొంతం. అందుకనే జాతీయస్ధాయిలో కేసీయార్ ను నమ్మటానికి ఎవరు ముందుకు రావటంలేదు. ఈమధ్య కూడా కేంద్రంపై యుద్ధమే అని ప్రకటించిన మూడు రోజులకే ఢిల్లీ వెళ్ళి మోడి, అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మోడి గురించి ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు.

 చాలా కాలంగా ప్రగతి భవన్లో ఎలాంటి హడావుడి లేదు. అలాంటిది ఇపుడు ఒక్కసారిగా ఎందుకు హడావుడి పెరిగిందో అర్ధం కావటంలేదు. నిజానికి దేశవ్యాప్తంగా మోడీ పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. అయితే ప్రత్యామ్నాయం లేకపోవటంతో బీజేపీకే ఓట్లేయక తప్పటంలేదు. ఎన్డీయేయేతర పార్టీల్లో చాలా పార్టీలు తమ రాష్ట్రాల్లో బలంగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకుంటున్నాయి. అయితే ప్రత్యామ్నాయంగా ఏకతాటిపైకి రావాలంటే ఇష్టపడటంలేదు.

ఇపుడు ప్రగతి భవన్లో హడావుడి చూస్తుంటే ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవటానికి కేసీయార్ ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు సాగేట్లు కనబడటంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు మమత, నవీన్, జగన్, కేజ్రీవాల్ తో పాటు తాను కూడా వ్యతిరేకమే. కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో ప్రత్యామ్నాయం సాధ్యంకాదు.  ఈ విషయం కేసీయార్ కు తెలీకుండానే ఉంటుందా. చూద్దాం ఏమి ప్రయత్నాలు చేస్తున్నారో ?

This post was last modified on January 12, 2022 11:28 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

1 min ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

1 hour ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

12 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

13 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago