Political News

ఎన్నికల కోసం కొత్త ప్లాన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాన్ని వర్కవుట్ చేయబోతున్నారు. అంటే ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినా ఎందుకనో లాంచ్ చేయలేదు. అందుకనే తొందరలోనే తన సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సరికొత్త ప్లాన్ ఏమిటంటే సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కుప్పంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువకుడిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

పార్టీలోకి యువత ఎక్కువగా రావాలని కోరుకుంటున్న చంద్రబాబు సేవామిత్ర రూపంలో యువతకు బాగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ వాలంటీర్లే పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాలను జనాలకు అందచేస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించింది. రేపటి ఎన్నికల్లో వైసీపీకి వాలంటీర్లే కీలకంగా వ్యవహరించబోతున్నారని చంద్రబాబు అనుమానం.

అందుకనే దానికి విరుగుడుగా టీడీపీ తరపున కూడా సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేసి యువత ద్వారా రాజకీయం చేయాలనేది చంద్రబాబు ఆలోచన. ఈ ఏడాదిలోగా సేవామిత్రలను నియమించి పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన హయాంలో జనాలకు జరిగిన మేళ్ళు, టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సేవామిత్రలు వివరిస్తారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాని, అన్యాయాలు జరుగుతున్నాయని జనాలకు వివరిస్తారట.

అంటే ప్రభుత్వం+ వైసీపీకి  వ్యతిరేకంగాను, టీడీపీకి అనుకూలంగాను ఈ సేవామిత్రలు పనిచేయాలన్నమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవామిత్రలు పనిచేస్తుంటే వాలంటీర్లు లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా అధికారపార్టీ నేతలు చూస్తు ఊరుకుంటారా ? అప్పుడేమన్నా గొడవలు జరిగితే దానికి బాధ్యత ఎవరిది అనే విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పలేదు. ఏదేమైనా పార్టీకి మద్దతుగా పనిచేసేందుకు ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని మాత్రమే చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరీ కొత్త వ్యవస్ధ వల్ల పార్టీకి ఎంత ఉపయోగమో చూడాల్సిందే.

This post was last modified on January 9, 2022 12:37 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

48 mins ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

2 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

3 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

3 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

5 hours ago

అల్లుడి విమర్శలపై అంబటి రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…

5 hours ago