Political News

కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్

పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విచారణకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఘటనపై విచారణ జరిపేందుకు లేదంటు నిలిపేసింది. నాలుగు రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం అందరికీ తెలిసిందే. రోడ్డు మార్గంలో వెళుతున్న మోడీ కాన్వాయ్ ను  ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు 20 నిమిషాల పాటు ఆపేసిన విషయం తెలిసిందే. చివరకు చేసేది లేక ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలో భద్రతా వైఫల్యానికి కారణం మీరేనంటే కాదు మీరే అంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని నెట్టేసుకుంటున్నాయి. దాంతో ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కూడా విచారణ కమిటీలను వేశాయి.  మూగ్గురు సభ్యులతో కేంద్రం కమిటి వేస్తే, ఇద్దరు సభ్యులతో రాష్ట్రం కమిటి వేసింది. ఇక్కడ కమిటీలు వేయడం వెనుక ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. కేంద్రమేమో తప్పంతా రాష్ట్రానిదే అని చెప్పటం, రాష్ట్రం వేసిన కమిటీ తప్పంతా కేంద్రానిదే అని తేల్చబోతున్నట్లు అందరికీ అర్ధమైసోయింది.

ఈ నేపధ్యంలోనే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. రెండు కమిటిలు విచారణను నిలిపేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి భద్రతా నియమావళిని, ఎస్పీజీ బాధ్యతలను, విధులు తదితరాలన్నింటినీ వెంటనే సుప్రింకోర్టుకు అందించాలని ఆదేశించింది. దాంతో కమిటిలు వేసి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం ఆలోచనలకు ఆదిలోనే బ్రేకు పడినట్లయ్యింది. తొందరలోనే జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పరిస్దితి అంతంత మాత్రంగానే ఉంది.

ఎన్ని ప్రీపోల్ సర్వేల్ జరిగినా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎవరు చెప్పలేదు. దాంతో ఏమి చేయాలో బీజేపీకి అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో రైతుల ఆందోళన ఎంతకీ ఆగటంలేదు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసినా యూపీలోని లఖింపూర్ ఖేరిలో వెహికల్ నడిపి రైతుల చావుకు కారణమైన కేంద్రమంత్రి ప్రశాంత్ కుమార్ ను మంత్రవర్గంలో నుండి తప్పించాలని, అరెస్టు చేయాలని రైతుసంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తునే ఉన్నాయి.

ఈ నేపధ్యంలోనే మోడి పంజాబ్ లో పర్యటించటం, ఆందోళనకారులు అడ్డుకోవటం. నిజానికి ఆందోళనకారులు ఫ్లైవర్ పై వాహనాలు పెట్టింది మోడిని అడ్డుకునేందుకు కాదు. ఎందుకంటే మోడి ఫ్లైఓవర్ పై వస్తున్నట్లు ఆందోళనకారులకు అసలు తెలీనే తెలీదు. ఏదేమైనా రెండు విచారణ కమిటీలను సుప్రింకోర్టు నిలిపేయటం కేంద్రానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. మరి చివరకు సుప్రింకోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే. 

This post was last modified on January 8, 2022 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

13 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

53 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

11 hours ago