పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విచారణకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఘటనపై విచారణ జరిపేందుకు లేదంటు నిలిపేసింది. నాలుగు రోజుల క్రితం పంజాబ్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం అందరికీ తెలిసిందే. రోడ్డు మార్గంలో వెళుతున్న మోడీ కాన్వాయ్ ను ఫ్లైఓవర్ పైన ఆందోళనకారులు 20 నిమిషాల పాటు ఆపేసిన విషయం తెలిసిందే. చివరకు చేసేది లేక ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలో భద్రతా వైఫల్యానికి కారణం మీరేనంటే కాదు మీరే అంటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపాన్ని నెట్టేసుకుంటున్నాయి. దాంతో ఇటు కేంద్రం, అటు రాష్ట్రం కూడా విచారణ కమిటీలను వేశాయి. మూగ్గురు సభ్యులతో కేంద్రం కమిటి వేస్తే, ఇద్దరు సభ్యులతో రాష్ట్రం కమిటి వేసింది. ఇక్కడ కమిటీలు వేయడం వెనుక ఉద్దేశ్యం అందరికీ తెలిసిందే. కేంద్రమేమో తప్పంతా రాష్ట్రానిదే అని చెప్పటం, రాష్ట్రం వేసిన కమిటీ తప్పంతా కేంద్రానిదే అని తేల్చబోతున్నట్లు అందరికీ అర్ధమైసోయింది.
ఈ నేపధ్యంలోనే మధ్యలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది. రెండు కమిటిలు విచారణను నిలిపేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి భద్రతా నియమావళిని, ఎస్పీజీ బాధ్యతలను, విధులు తదితరాలన్నింటినీ వెంటనే సుప్రింకోర్టుకు అందించాలని ఆదేశించింది. దాంతో కమిటిలు వేసి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రం ఆలోచనలకు ఆదిలోనే బ్రేకు పడినట్లయ్యింది. తొందరలోనే జరగబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పరిస్దితి అంతంత మాత్రంగానే ఉంది.
ఎన్ని ప్రీపోల్ సర్వేల్ జరిగినా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎవరు చెప్పలేదు. దాంతో ఏమి చేయాలో బీజేపీకి అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో రైతుల ఆందోళన ఎంతకీ ఆగటంలేదు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసినా యూపీలోని లఖింపూర్ ఖేరిలో వెహికల్ నడిపి రైతుల చావుకు కారణమైన కేంద్రమంత్రి ప్రశాంత్ కుమార్ ను మంత్రవర్గంలో నుండి తప్పించాలని, అరెస్టు చేయాలని రైతుసంఘాలు ఇంకా ఆందోళనలు చేస్తునే ఉన్నాయి.
ఈ నేపధ్యంలోనే మోడి పంజాబ్ లో పర్యటించటం, ఆందోళనకారులు అడ్డుకోవటం. నిజానికి ఆందోళనకారులు ఫ్లైవర్ పై వాహనాలు పెట్టింది మోడిని అడ్డుకునేందుకు కాదు. ఎందుకంటే మోడి ఫ్లైఓవర్ పై వస్తున్నట్లు ఆందోళనకారులకు అసలు తెలీనే తెలీదు. ఏదేమైనా రెండు విచారణ కమిటీలను సుప్రింకోర్టు నిలిపేయటం కేంద్రానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. మరి చివరకు సుప్రింకోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాల్సిందే.
This post was last modified on January 8, 2022 12:51 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…