సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. చెత్త సినిమాలు తీసి, అనవసర వివాదాలు రాజేసి, చీప్ కామెంట్లు చేసి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం మీద అర్థవంతమైన వాదన చేస్తూ, ఆలోచింపజేసే ప్రశ్నలు సంధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ మద్దతుదారులా కనిపించిన ఆయన.. ఉన్నట్లుండి ఈ ఇష్యూలో యు టర్న్ తీసుకుని జగన్ సర్కారు తీరును దుయ్యబట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే తర్వాతి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు జనాలకు లేని పోని సందేహాలు కలుగుతున్నాయి. ఒక దశ వరకు తనదైన శైలిలో వైకాపా ప్రభుత్వ తీరును ఆయన ఏకిపడేస్తున్నట్లు కనిపించారు.
కానీ తర్వాత మర్యాద రామన్న పాత్రలోకి మారిపోయారు. మంత్రి పేర్ని నానితో జరిగిన ట్విట్టర్ సంవాదంలో వర్మ సుతిమెత్తగా మాట్లాడారు. నెమ్మదిగా టోన్ తగ్గిస్తూ వచ్చారు. చివరికి ఆయనతో రాజీకి వస్తున్నట్లు కనిపించారు. అంతకుముందు వాడి వేడిగా ఉన్న వాతావరణం తర్వాత చల్లబడిపోయింది. ఇప్పుడేమో టికెట్ల ధరల విషయమై మాట్లాడ్డానికి పేర్ని నాని తనను విజయవాడకు ఆహ్వానించారని, తాను వెళ్లబోతున్నానని ప్రకటించాడు వర్మ. ఐతే సీఎంతో, మంత్రులతో ఈ ఇష్యూపై మాట్లాడ్డానికి మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు గట్టిగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు.
అలాంటిది ఇప్పుడు వర్మకు పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వడమేంటో అర్థం కావడం లేదు. ఓవైపు టికెట్ల ధరలపై కమిటీ వేశారు. కోర్టులో పోరాడుతున్నారు. పరిశ్రమ ప్రతినిధులతో వేరుగా చర్చలు జరుపుతామంటున్నారు. ఇప్పుడిలా వర్మకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఏంటో అంతుబట్టడం లేదు. ఇదంతా గమనిస్తే.. ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా.. వర్మ ఈ టికెట్ల ధరల ఇష్యూను డైల్యూట్ చేయడానికే రంగంలోకి దిగాడా.. ఊరికే హడావుడి చేసి సీరియస్ ఇష్యూను కామెడీగా మార్చబోతున్నాడా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 8, 2022 12:24 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…