సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. చెత్త సినిమాలు తీసి, అనవసర వివాదాలు రాజేసి, చీప్ కామెంట్లు చేసి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం మీద అర్థవంతమైన వాదన చేస్తూ, ఆలోచింపజేసే ప్రశ్నలు సంధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ మద్దతుదారులా కనిపించిన ఆయన.. ఉన్నట్లుండి ఈ ఇష్యూలో యు టర్న్ తీసుకుని జగన్ సర్కారు తీరును దుయ్యబట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే తర్వాతి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు జనాలకు లేని పోని సందేహాలు కలుగుతున్నాయి. ఒక దశ వరకు తనదైన శైలిలో వైకాపా ప్రభుత్వ తీరును ఆయన ఏకిపడేస్తున్నట్లు కనిపించారు.
కానీ తర్వాత మర్యాద రామన్న పాత్రలోకి మారిపోయారు. మంత్రి పేర్ని నానితో జరిగిన ట్విట్టర్ సంవాదంలో వర్మ సుతిమెత్తగా మాట్లాడారు. నెమ్మదిగా టోన్ తగ్గిస్తూ వచ్చారు. చివరికి ఆయనతో రాజీకి వస్తున్నట్లు కనిపించారు. అంతకుముందు వాడి వేడిగా ఉన్న వాతావరణం తర్వాత చల్లబడిపోయింది. ఇప్పుడేమో టికెట్ల ధరల విషయమై మాట్లాడ్డానికి పేర్ని నాని తనను విజయవాడకు ఆహ్వానించారని, తాను వెళ్లబోతున్నానని ప్రకటించాడు వర్మ. ఐతే సీఎంతో, మంత్రులతో ఈ ఇష్యూపై మాట్లాడ్డానికి మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు గట్టిగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు.
అలాంటిది ఇప్పుడు వర్మకు పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వడమేంటో అర్థం కావడం లేదు. ఓవైపు టికెట్ల ధరలపై కమిటీ వేశారు. కోర్టులో పోరాడుతున్నారు. పరిశ్రమ ప్రతినిధులతో వేరుగా చర్చలు జరుపుతామంటున్నారు. ఇప్పుడిలా వర్మకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఏంటో అంతుబట్టడం లేదు. ఇదంతా గమనిస్తే.. ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా.. వర్మ ఈ టికెట్ల ధరల ఇష్యూను డైల్యూట్ చేయడానికే రంగంలోకి దిగాడా.. ఊరికే హడావుడి చేసి సీరియస్ ఇష్యూను కామెడీగా మార్చబోతున్నాడా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 8, 2022 12:24 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…