సీరియస్ ఇష్యూని వర్మ కామెడీ చేయడు కదా!కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. చెత్త సినిమాలు తీసి, అనవసర వివాదాలు రాజేసి, చీప్ కామెంట్లు చేసి పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం మీద అర్థవంతమైన వాదన చేస్తూ, ఆలోచింపజేసే ప్రశ్నలు సంధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.
గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ మద్దతుదారులా కనిపించిన ఆయన.. ఉన్నట్లుండి ఈ ఇష్యూలో యు టర్న్ తీసుకుని జగన్ సర్కారు తీరును దుయ్యబట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఐతే తర్వాతి పరిణామాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు జనాలకు లేని పోని సందేహాలు కలుగుతున్నాయి. ఒక దశ వరకు తనదైన శైలిలో వైకాపా ప్రభుత్వ తీరును ఆయన ఏకిపడేస్తున్నట్లు కనిపించారు.
కానీ తర్వాత మర్యాద రామన్న పాత్రలోకి మారిపోయారు. మంత్రి పేర్ని నానితో జరిగిన ట్విట్టర్ సంవాదంలో వర్మ సుతిమెత్తగా మాట్లాడారు. నెమ్మదిగా టోన్ తగ్గిస్తూ వచ్చారు. చివరికి ఆయనతో రాజీకి వస్తున్నట్లు కనిపించారు. అంతకుముందు వాడి వేడిగా ఉన్న వాతావరణం తర్వాత చల్లబడిపోయింది. ఇప్పుడేమో టికెట్ల ధరల విషయమై మాట్లాడ్డానికి పేర్ని నాని తనను విజయవాడకు ఆహ్వానించారని, తాను వెళ్లబోతున్నానని ప్రకటించాడు వర్మ. ఐతే సీఎంతో, మంత్రులతో ఈ ఇష్యూపై మాట్లాడ్డానికి మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు గట్టిగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు.
అలాంటిది ఇప్పుడు వర్మకు పిలిచి అపాయింట్మెంట్ ఇవ్వడమేంటో అర్థం కావడం లేదు. ఓవైపు టికెట్ల ధరలపై కమిటీ వేశారు. కోర్టులో పోరాడుతున్నారు. పరిశ్రమ ప్రతినిధులతో వేరుగా చర్చలు జరుపుతామంటున్నారు. ఇప్పుడిలా వర్మకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఏంటో అంతుబట్టడం లేదు. ఇదంతా గమనిస్తే.. ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా.. వర్మ ఈ టికెట్ల ధరల ఇష్యూను డైల్యూట్ చేయడానికే రంగంలోకి దిగాడా.. ఊరికే హడావుడి చేసి సీరియస్ ఇష్యూను కామెడీగా మార్చబోతున్నాడా అన్న సందేహాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే విడుదలైన సింగ్ గీతంకు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన కనిపిస్తోంది. కంటెంట్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్టయ్యేలా లేకపోయినా…
2026 సంవత్సరంలో ఆరు నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో రెండు వారాలు బాలన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో పదమూడు…
ఈ ఏడాది మోస్ట్ అవైడెట్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు…
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…