Political News

మోడీ భద్రతకు రోజు ఖర్చెంతో తెలుసా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందా తెలుసా ? 1.62 కోట్ల రూపాయలు. అవును మామూలుగా ఎవరు కూడా నమ్మలేరు. కానీ ప్రధానమంత్రి భద్రత విషయంపై  ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన సమాధానంతో ఈ లెక్క బయటపడింది. దేశంలో ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఒక ప్రశ్న వేశారు.

దీనికి హోంశాఖ మంత్రి సమాధానమిస్తూ ఎస్పీజీ భద్రత దేశం మొత్తం మీద కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఉందన్నారు. గతంలో గాంధీ ఫ్యామిలిలో ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండేదని అయితే ఈమధ్య కాలంలో వారికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించినట్లు చెప్పారు. దేశంలోని అత్యంత ప్రముఖులకు ఎస్పీజీ భద్రత తీసేసి దాని స్థానంలో సీఆర్పీఎప్ భద్రతను కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే హోంశాఖ మంత్రి చెప్పిన ప్రకారం ప్రధానమంత్రికి తప్ప ఇంకెవరికీ ఎస్పీజీ భద్రత లేదు.

మరైతే హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజనాధ్ సింగ్ కు ఎలాంటి భద్రత ఉందనే విషయంలో స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళ భద్రతలో ఎస్పీజీ భద్రత సిబ్బంది ఉన్నట్లే కనబడుతుంటుంది. కానీ హోంశాఖ మంత్రి స్వయంగా ఈ విషయం చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. ఒకపుడు ప్రధానితో పాటు గాంధీ ఫ్యామిలీలోని వారికి ఎస్పీజీ భద్రత కోసం 3 వేల మంది ప్రత్యేక కమేండోలుండేవారు. ఈ రక్షణ బృందానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రు. 594 కోట్లు ఖర్చుపెడుతోంది.

ఒకపుడు పై మొత్తాన్ని ఎస్పీజీ భద్రత ఉండే నలుగురికి సమానంగా ఖర్చుచేసేది. అయితే ఎస్పీజీ చట్టంలో మార్పులు తెచ్చి మిగిలిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత అవసరం లేదని తేల్చటంతో మొత్తం 3 వేల మందిని+594 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రధానమంత్రికే వాడేస్తున్నారు. సో మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే గంటకు రు. 6.75 లక్షలు ప్రధానమంత్రి భద్రతకు ఖర్చవుతోంది. గంటకు రు. 6.75 లక్షలంటే రోజుకు 1.62 కోట్ల రూపాయలని లెక్క తేలింది. ఏదేమైనా రోజుకు ప్రధానమంత్రి భద్రత కోసం ఏకంగా 1.62 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు.  

This post was last modified on January 7, 2022 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

2 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

5 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

6 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

7 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

7 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

7 hours ago