మేం ఏమైనా అంటాం.. ఎదుటోడు మాత్రం ఏమీ అనకూడదన్న తీరు అభ్యంతరకరం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడినప్పుడు తమకు ఎంత బాధ కలిగిందో.. మరెంత వేదన కలిగిందో.. తమ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంటే..అలాంటి ఇబ్బందే ఉంటుందన్న చిన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు గుర్తించరు. తన కుమారుడు హిమాన్షును ఉద్దేశించి.. చేసిన మాటపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేయటం.. చిన్న పిల్లాడ్ని పట్టుకొని ఇలా అంటారా? ఇదేంపద్దతి? అని ప్రశ్నించటం తెలిసిందే.
నిజమే.. ఎంత రాజకీయం అయితే మాత్రం పిల్లల్ని రాజకీయాల్లోకి లాగటం.. వారి శరీర తత్త్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదు. అదే సమయంలో.. కేటీఆర్ అండ్ కో కూడా అలానే ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోకూడదు. మేం ఏమైనా అంటాం. మీరు పడాలి. కానీ.. మీరు మాత్రం ఆచితూచి అన్నట్లు మాట్లాడాలని అనటంలో అర్థం లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఘాటు వ్యాఖ్యలకు రియాక్టు అయిన మంత్రి కేటీఆర్.. పెద్ద ఎత్తున ఫైర్ కావటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంగా నెత్తి మీద బొచ్చు లేని వాళ్లు కూడా మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన మాటలు అభ్యంతరకరం. అంటే.. కేసీఆర్ ను కానీ.. కేటీఆర్ ను కానీ ఏమైనా అనాలంటే నెత్తి మీద బొచ్చు ఉండాలా? బొచ్చు ఉండటంతో ప్రాధమిక అర్హత వస్తుందా? అన్న ప్రశ్నలు రాక మానదు.
బాడీ షేమింగ్ అంటూ విలవిలలాడిన ఆయన.. తాను చేసే బాడీ షేమింగ్ మాటలు కూడా ఎదుటోళ్లను అంతే నొప్పి కలిగిస్తాయన్నది మర్చిపోకూడదు. ఆ మాటకువస్తే.. టీఆర్ఎస్ లోనే నెత్తి మీద బొచ్చు లేని నేతలు ఎంతో మంది ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి.. వారు మాట్లాడిన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ ఉద్దేశమా? ఒకరి మాటను తప్పు పట్టొచ్చు. కానీ.. వారి భౌతిక రూపాన్ని.. వారిలో ఫలానా లేదంటూ వ్యాఖ్యలు చేయటం మాత్రం కచ్ఛితంగా అభ్యంతరకరమన్నది మర్చిపోకూడదు.
This post was last modified on January 6, 2022 1:54 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…