ఏపీలో సినిమా టికెట్ల వివాదం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాకతో రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రులు వర్సెస్ వర్మగా జరుగుతున్న మాటల యుద్ధం తార స్థాయికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానాలివ్వడం…దానికి బదులుగా వర్మ మరికొన్ని ప్రశ్నలు సంధించడంతో….ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చినికి చినికి గాలివానగా మారిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని, పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు చాలా అభిమానమని వర్మ అన్నారు. కేవలం తమ సమస్యలు తాము సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో, లేక, తమ కోణం నుంచి ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం వల్లనో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని వర్మ చెప్పారు. ప్రభుత్వం అనుమతిస్తే పేర్ని నానిని కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి తమ సమస్యలకు సంబంధించిన వివరణ ఇస్తానని వర్మ అన్నారు. తన వివరణ విన్న తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నానని వర్మ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే వర్మ ట్వీట్ కు పేర్ని నాని కూడా సానుకూలంగా రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదములు వర్మ గారు. తప్పకుండా త్వరలోనే కలుద్దాం’ అని పేర్ని నాని రీట్వీట్ చేశారు. ఆ తర్వాత పేర్ని నాని రిప్లైకు వర్మ వెంటనే వర్మ స్పందించారు. పేర్ని నాని నుంచి సానుకూల స్పందన వచ్చిందని, అందువల్ల ఈ అనవసరమైన వివాదానికి తాను ఇంతటితో ముగింపు పలుకుతున్నానని వర్మ మరో ట్వీట్ చేశారు. దీంతో, వర్మ వర్సెస్ పేర్ని నాని వివాదానికి పుల్ స్టాప్ పడ్డట్లుగానే కనిపిస్తోంది.
మరోవైపు, ఆ ట్వీట్ తర్వాత వర్మ వేరే టాపక్ పై మరో ట్వీట్ చేశారు. అంతిమ్, సత్యమేవ జయతే-2, 83 వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, అదే సమయంలో ఒక ప్రాంతీయ భాషా చిత్రమైన పుష్పను జాతీయ స్థాయి చిత్రంగా విజయవంతంగా నిలబెట్టిన అల్లు అర్జున్ కు అభినందనలని వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో వర్మ ఫోకస్ సినిమా టికెట్లపై నుంచి పూర్తిగా మళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on January 5, 2022 10:35 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…